Epstein Case: కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తెకు ఊరట.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
- ఎప్స్టీన్ కేసులో కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తెకు ఊరట
- ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
- 24 గంటల్లో పూర్తి చేయాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్స్టీన్ కేసులో కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తె హిమయానీ పూరికి ఊరట లభించింది. అమెరికన్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో హిమయానీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా దాఖలు వేశారు. దీంతో మంగళవారం ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ను 24 గంటల్లోగా తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
సోషల్ మీడియాలో అటువంటి కంటెంట్ను ఏ విధంగానూ ప్రచురించడం లేదా వ్యాప్తి చేయడాన్ని ఏ మాత్రం యోగ్యం కాదని జస్టిస్ మినీ పుష్కర్ణ తప్పుపట్టారు. హిమాయనీ పూరి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ.. సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులను తొలగించకపోతే.. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లే కంటెంట్ను తొలగిస్తాయని స్పష్టం చేశారు. హిమయానీ పూర్తికి అనుకూలంగా ప్రాథమికంగా కేసు రుజువైందని.. మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే ఆమెకు పూడ్చలేని నష్టాన్ని కలిగించినట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది.
ఇక హిమయానీ పూరి తరపున సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. తన క్లయింట్కు ఆర్థిక నిపుణురాలిగా ప్రపంచ ఖ్యాతి ఉందని.. ఆమెను కాపాడుకోవాలని.. ఆరోపణలు పూర్తిగా అబద్ధం, నిరాధారం, దురుద్దేశపూరితమైనవిగా పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
ఫిబ్రవరి 22, 2026న యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డిన్, డిజిటల్ న్యూస్ పోర్టల్స్, ఇతర వెబ్ ఆధారిత ప్రచురణలతో సహా సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్ఫారమ్ల్లో హిమయానీపై తప్పుడు ప్రచారం జరిగింది. ఎప్స్టీన్తో హిమయానీ పూరికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపార, ఆర్థిక లేదా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెళ్లువెత్తాయి. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా ఆమెకు ఢిల్లీ హైకోర్టు అండగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!