Epstein Case: కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తెకు ఊరట.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
- ఎప్స్టీన్ కేసులో కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తెకు ఊరట
- ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
- 24 గంటల్లో పూర్తి చేయాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్స్టీన్ కేసులో కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తె హిమయానీ పూరికి ఊరట లభించింది. అమెరికన్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో హిమయానీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా దాఖలు వేశారు. దీంతో మంగళవారం ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ను 24 గంటల్లోగా తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
సోషల్ మీడియాలో అటువంటి కంటెంట్ను ఏ విధంగానూ ప్రచురించడం లేదా వ్యాప్తి చేయడాన్ని ఏ మాత్రం యోగ్యం కాదని జస్టిస్ మినీ పుష్కర్ణ తప్పుపట్టారు. హిమాయనీ పూరి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ.. సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులను తొలగించకపోతే.. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లే కంటెంట్ను తొలగిస్తాయని స్పష్టం చేశారు. హిమయానీ పూర్తికి అనుకూలంగా ప్రాథమికంగా కేసు రుజువైందని.. మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే ఆమెకు పూడ్చలేని నష్టాన్ని కలిగించినట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది.
ఇక హిమయానీ పూరి తరపున సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. తన క్లయింట్కు ఆర్థిక నిపుణురాలిగా ప్రపంచ ఖ్యాతి ఉందని.. ఆమెను కాపాడుకోవాలని.. ఆరోపణలు పూర్తిగా అబద్ధం, నిరాధారం, దురుద్దేశపూరితమైనవిగా పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
ఫిబ్రవరి 22, 2026న యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డిన్, డిజిటల్ న్యూస్ పోర్టల్స్, ఇతర వెబ్ ఆధారిత ప్రచురణలతో సహా సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్ఫారమ్ల్లో హిమయానీపై తప్పుడు ప్రచారం జరిగింది. ఎప్స్టీన్తో హిమయానీ పూరికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపార, ఆర్థిక లేదా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెళ్లువెత్తాయి. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా ఆమెకు ఢిల్లీ హైకోర్టు అండగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..