ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు దాడి జరిపారు. అందులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు అనే వార్తలు సంచలనంగా మారాయి. బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడంతో ఇది హాట్ టాపిక్గా మారింది. పబ్లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్…
మత్తు వదలరా, సేనాపతి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నరేష్ అగస్త్య మళ్లీ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మురళి కాట్రగడ్డ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతలు ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో “అసురగణ రుద్ర” అనే టైటిల్ను ప్రకటించారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ…
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయనతో పాటు దాదాపు 150 మందిని , పబ్ యజమానిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంజారాహిల్స్ లోని ఓ పబ్ లో తాజాగా పోలీసులు దాడులు జరిపారు. పోలీసులకు ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ పట్టుబడిన 150 మంది రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. Read Also :…
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం… ఈరోజు తెలుగు వారికి మరో కొత్త సంవత్సరం ప్రారంభం. తెలుగు వారు సాంప్రదాయకంగా భావించే ఉగాది పండగను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగ చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2, శనివారం వచ్చింది. ఈ పండగ సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా తమ ఇంటిని…
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘డియర్’ అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయం అయ్యారు. బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజయాలు సాధించారు. ఏఎన్నార్తో ‘కాలేజీ బుల్లోడు’, జగపతిబాబుతో ‘భలే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య,…
గత శుక్రవారం పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కావడంతో మరో సినిమా గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. టాలీవుడ్ లో అయితే ఈ మాగ్నమ్ ఓపస్ మూవీకి దారి వదులుతూ మిగిలిన వాళ్ళంతా ఒక వారం వెనక్కో ఓ వారం ముందుకో వెళ్ళిపోయారు. అయితే ఈ శుక్రవారం ‘ట్రిపుల్ ఆర్’ హంగామా సద్దుమణగడంతో మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. విశేషం ఏమంటే అందులో చెప్పుకోదగ్గది తాప్సీ కీలక పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’.…
తాజాగా టాలీవుడ్ ప్రముఖులంతా తిరుమలలో సందడి చేశారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల ఆలయానికి వెళ్ళారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించడం విశేషం. అయితే అక్కడ ఉన్న భక్తులు వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వీరికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో…
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్తో అటు రామ్చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేష్బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్చరణ్, అల్లు అర్జున్ యువ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఈ హీరోలు వరుస విజయాలు సాధిస్తే టాలీవుడ్ పరిశ్రమకు వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. అయితే ఈ హీరోలు రెండేళ్లకు…
ప్రస్తుతం బాలీవుడ్ చూపు అంతా టాలీవుడ్ మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క స్టైలిష్ మేకోవర్ తో టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ లాంటి వారు ముంబై లో స్టైలిష్ మేకోవర్ లో కనిపిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా లైగర్ బ్యాచ్ బాలీవుడ్ గ్రాండ్ పార్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.…
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజా మూవీ ఆర్ఆర్ఆర్.. ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక, ప్రభుత్వం సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ కొత్త జీవోను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ను కలిశారు దర్శకుడు రాజమళి, నిర్మాత డీవీవీ దానయ్య.. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి, దానయ్య.. మీడియాతో మాట్లాడారు.. సీఎం వైఎస్ జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్…