ఈసారి సంక్రాంతి బరిలో ఇద్దరు కొత్త కథానాయకులను తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. విశేషం ఏమంటే ఈ ఇద్దరూ కూడా సినిమా రంగానికి చిరపరిచితులైన వారి వారసులే. అందులో ఒకరు కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. మరొకరు ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్. గల్లా అశోక్ గుంటూరు టీడీపీ ఎం.పి. గల్లా జయదేవ్, కృష్ణ కుమార్తె పద్మావతి కుమారుడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. క్యాన్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇక ఈ మూవీలో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ చిట్టి ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ తో…
దక్షిణాదిన సమంతకు స్టార్ హీరోయిన్ గా చక్కటి గుర్తింపు ఉంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్2’తో అటు ఉత్తరాదిలోనూ నటిగా చక్కటి ఇమేజ్ తెచ్చుకుంది సమంత. ఈ వెబ్ సీరీస్ లో సమంత పోషించిన నెగెటీవ్ రోల్ ఫ్యామిలీ లైఫ్ కి ఇబ్బంది కలిగించినా ఆడియన్స్ కు మాత్రం బాగా దగ్గర చేసింది. ఇప్పుడు సమంత మరోసారి నెగెటీవ్ రోల్ లో కనిపించబోతోంది. విడాకుల తరువాత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ తో దుమ్ము రేపిన సమంత తన…
కోలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకోవాలన్నా.. కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్నా హీరో కార్తీ ముందుంటాడు. ఇప్పటివరకు కార్తీ చేసిన సినిమాలన్నీ విభిన్నమైన కథలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కార్తీకి తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం కార్తీ ‘సర్దార్’, ‘విరుమన్’ చిత్రాలతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే పాత్ర కోసం ప్రాణం పెట్టె…
నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. జనవరి 14న రాబోతున్న ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లోని ఎగ్జిబిటర్స్ అలకపూనినట్లు వినవస్తోంది. దీనికి కారణం ఇటీవల ప్రెస్ మీట్ లో థియేటర్లలో టికెట్ రేట్ల విషయంలో నాగార్జున స్పందన అని అంటున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీస్టూడియోస్ తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘బంగార్రాజు’ను సంక్రాంతికే విడుదల చేస్తున్నామని తెలియచేయటానికి ఇటీవల విలేకరుల సమావేశం…
టాలీవుడ్ లో నటుడిగా, రచయితగా తనికెళ్ళ భరణి సుపరిచితుడే. ఇక ఆయన శివుడిపై రాసే కవితలకు ఫ్యాన్స్ మాములుగా ఉండరు. అయితే చిత్ర పరిశ్రమలో ఉంటున్నామంటే ఎన్ని పురస్కారాలు ఉంటాయో.. అన్ని తిరస్కారాలు కూడా ఉంటాయి. ఎంతమంది మెచ్చేవాళ్ళు ఉంటారో అంతేముంది తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. తాజగా ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తనను తిట్టడం కాదు.. చంపేస్తామని బెదిరించారని కూడా చెప్పుకొచ్చారు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఊహ హీరోయిన్ గా ఆమె సినిమా తెరకెక్కిన సంగతి…
‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్ (శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ” ‘రౌడీ బాయ్స్’ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్. మా ఫ్యామిలీ…
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా, కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ జంటగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే పేరుతో కొత్త సినిమా శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ పై అల్లు అన్విత క్లాప్ నివ్వగా,…
పాత కథలకే కొత్త సొబగులు అద్ది సరికొత్తగా మలచి అలరించారు ఎందరో దర్శకులు. ఈ తరం దర్శకులు కూడా అదే తీరున సాగుతున్నారు. అలాంటి విన్యాసాలు ఏ నాడో చేసి ఆకట్టుకున్నారు దర్శకరచయిత, నటుడు భాగ్యరాజా. ఈ తరం వారికి దర్శకునిగా ఆయన పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. నవతరం ప్రేక్షకులలో కొంతమందికి ఆయన నటునిగా పరిచయం ఉన్నారు. చాలా రోజుల నుంచే భాగ్యరాజా నటనలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా కనిపిస్తున్నారు. అయితే నటునిగా,…
ఆ రోజుల్లో అందాలనటిగా రాజ్యమేలిన బి.సరోజాదేవి తెరపై కనిపిస్తే చాలు అభిమానుల మది ఆనందంతో చిందులు వేసేది. చిలుక పలుకులు వల్లిస్తూ, నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి.సరోజాదేవి. కన్నడసీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలను పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆ నాటి అభిమానులు ఈ నాటికీ గుర్తు…