హీరోగా కొంతకాలంగా వెనకబడిన వరుణ్ సందేశ్ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుని, కొత్త సంవత్సరం తొలి రోజున ‘ఇందువదన’ మూవీతో జనం ముందుకు వచ్చాడు. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీని ఎం. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేశారు. వాసు (వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి గిరిజన తండాకు చెందిన ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోని ప్రేమలో పడిన వీరిద్దరూ గూడెం కట్టుబాట్లను కాదని మనువాడతారు. భార్యను తనతో…
‘సంక్రాంతి అల్లుళ్లు’ విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్… ఈసారి ‘సమ్మర్ సోగాళ్ళు’గా మారిపోయారు. అయితే… వాళ్ళు సమ్మర్ కైనా వస్తారా అనే సందేహాన్ని ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజ్ ఫాన్ నాగరత్తమ్మ (సునయన) వ్యక్తం చేస్తోంది. కొత్త సంవత్సరంలో ‘ఎఫ్ 2 ఫ్రాంచైజ్’ ఫ్యాన్స్ కు విషెస్ తెలియచేస్తూ, అనిల్ రావిపూడి ఓ సరదా వీడియోను రూపొందించి, సోషల్ మీడియాలో వదిలాడు. సంక్రాంతి పండగ అంటే అరిసెలు, పూతరేకులు కంపల్సరీ! వాటిని తయారు చేసుకుని నాగరత్తమ్మ, అనిల్ రావిపూడి…
చిత్ర పరిశ్రమకు కరోనా దెబ్బ్బ మరోసారి గట్టిగా తగలనుందా ..? అంటే నిజమే అంటున్నాయి సినీ వర్గాలు. గతేడాది కరోనా వలన చిత్ర పరిశ్రమ కుదేలు అయిన సంగతి తెలిసిందే. థియేటర్లు మూయడం, షూటింగ్లు ఆగిపోవడం, ప్రముఖులు కరోనా బారిన పడడం ఇలా ఒకటేమిటి సినీ ఇండస్ట్రీకి చెప్పుకోలేనంత నష్టం వాటిల్లింది. ఇక ఈ ఏడాది అయినా కరోనా పోయి థియేటర్లు అవ్వడంతో చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కరోనా థర్డ్ వేవ్…
కొత్త సంవత్సరం.. కొత్త ప్రారంభం.. కొత్త జీవితం.. సినీ ఇండస్ట్రీలో గతేడాది కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ జ్ఞాపకాలను వదిలేసి.. న్యూ ఇయర్ లో సరికొత్త విజయాలను అందుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఇక నేడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త చిత్రాలు.. తమ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్నా “బోళా శంకర్”.. కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు.…
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కి గతేడాది కలిసి రాలేదన్న విషయం తెలిసిందే. వరుస పరాజయాలు శర్వా ను పలకరించాయి. జాను, మహా సముద్రం చిత్రాలు శర్వా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లు గా నిలిచాయి. ఇక ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తూ శర్వా కొత్త సినిమాలతో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ‘ఒకే ఒక జీవితం’ షూటింగ్ ని పూర్తి చేసుకోగా, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం సెట్స్ మీద ఉన్నది. చిత్ర లహరి చిత్రంతో సాయి…
‘మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు’ వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.…
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడం భయాందోళనలను కలిగిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా చాప కింద నీరులా పాకుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడింది. బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కరోనా బారిన పడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్…
టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించి, తెలుగువారికి చేరువైన ఉత్తరాది భామ సోనాలీ బింద్రే. స్టైల్ ఐకాన్ గా పేరొందిన సోనాలీ బింద్రే పలు యాడ్స్ లో నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించింది. వెండితెరపై సోనాలీ నాజూకు సోకులు చూసి ఫిదా అయిన జనాన్ని బుల్లితెరపైనా మురిపించింది. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగా వ్యవహరించి అలరించారు. క్యాన్సర్ ను ధైర్యంగా జయించి పలువురికి స్ఫూర్తి కలిగించారు సోనాలీ బింద్రే! సోనాలీ బింద్రే మహారాష్ట్ర…
సమాజంలోని సంచలన సంఘటనలను సినిమాలుగా తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకు కొత్త కాదు. ఆ తరహా చిత్రాల ద్వారా సమాజానికి వర్మ ఏం సందేశం ఇస్తున్నారు అనే దానికంటే… తన పాపులారిటీని పెంచుకోవడానికి ఆ సంఘటనలను వాడుకుంటున్నారు అనేది వాస్తవం. శంషాబాద్ సమీపాన 2019లో జరిగిన దిశ హత్య, ఆపైన జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో వర్మ ‘ఆశ: ఎన్ కౌంటర్’ పేరుతో ఓ సినిమా తీశారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా…
దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. దానికి ఇప్పుడు ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్ తోడైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్న రామ్ క్యారెక్టర్ ను తెలియచేస్తూ సాగే ఈ పాటను శివశక్తి దత్తా సంస్కృతంలో రాయడం విశేషం. ‘రామం రాఘవం… రణధీరం రాజసం’ అంటూ సాగే ఈ పాటను విజయ్ ప్రకాశ్,…