విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ డ్రామా “కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ బుధవారం తిరుపతికి చేరుకున్నారు విఘ్నేష్ శివన్, నయనతారలు. గురువారం తెల్లవారు జామున తిరుపతి ఆలయాన్ని సందర్శించి, శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ మేరకు విఘ్నేష్ ఇన్స్టాగ్రామ్లో నయనతారతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోసి వైరల్ అవుతోంది. Read Also…
తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న అంబులెన్స్ మాఫియా ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కలెక్టర్తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రుయా ఆర్ఎంవోను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరోవైపు రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ ప్రీపెయిడ్ ట్యాక్సీ ధరలను నిర్ణయించడానికి ఆర్డీవో, డీఎంహెచ్వో, డీఎస్పీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కాగా…
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన జరిగింది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి…
మొదట సినిమాల్లో నటించిన రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టారు.. ఇక, వైసీపీ చేరిన తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాదు.. మంత్రి పదవి కూడా చేపట్టారు.. అయితే, తనను సినిమాల్లోకి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి తీకొచ్చింది ఎవరు అనే విషయంపై పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించిన విషయం తెలసింది.. ఇవాళ తిరుపతిలోని బ్లిస్ హోటల్ లో మంత్రి రోజాను ఘనంగా సన్మానించింది ఏపీ హోటల్ అసోసియేషన్.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నన్ను సినిమాల్లోకి,…
పోలీసులు ఎంతగా ప్రయత్నించినా నేరాలు అదుపులోకి రావడం లేదు. టెంపుల్ సిటీ తిరుపతి జిల్లా ఏర్పాటు జరిగిన రోజే…..లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. నూతనంగా తిరుపతి పట్టణంలో కలెక్టర్,ఎస్పీలు బాధ్యతలు స్వీకరించిన రోజే మందు బాబులు రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తూ వుండగానే తెగబడ్డారు. సాక్షాత్తు భద్రతను పర్యవేక్షించవలసిన పోలిసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మద్యం మత్తులో ముగ్గురు కలసి ఒక యువకుడిని చితకబాదారు. అందరు అయ్యో పాపం వదిలెయ్యండి అని అంటున్నా వాళ్ళు పట్టించుకోలేదు.…
తిరుచానూరులో టీటీడీ నిధులతో నిర్మించిన పద్మావతి కాంప్లెక్స్ ను శ్రీ బాలాజీ జిల్లా” నూతన కలెక్టరేట్ కార్యాలయం గా మార్చడాన్ని వ్యకిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది అత్యున్నత ధర్మాసనం. కలెక్టరేట్ కార్యాలయం రావడం వల్ల…
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు వేగంగా సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి తుది నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన సుమారు 10-11 వేల వినతులు, అభ్యంతరాలు వచ్చాయి. స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం వుండదని తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషనుకు.. తుది నోటిఫికేషనుకు…
ఎంత పెద్ద మనిషైనా పాములు కనిపించగానే పై ప్రాణాలు పైనే పోతాయి. పాముని చూడగానే అక్కడినించి పరుగు లంకించుకుంటారు. పాములు పగబడతాయా..వెంటాడి కాటేస్తాయా? తప్పించుకున్న వదలవా? పాపాతికేళ్ల క్రితం పాము.. పాము పగతో సినిమాలు రావటం.. పాము పగ మీద బోలెడన్ని విషయాలు తరచూ మాట్లాడుకోవటం కనిపించేది. పాములు పగబడతాయని.. వెంటాడి.. వెంటాడి మరీ కాటేస్తాయని నమ్ముతోంది ఓ కుటుంబం. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని ఒక ఫ్యామిలీని వణికిపోతోంది. మరే కుటుంబం దొరకనట్లుగా.. ఒకే కుటుంబంలోని…
తెలుగు రాష్ట్రాల్లో రాహు కేతు పూజలు, గ్రహణాల సమయంలోనూ తెరిచి వుండే శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో అవకతవకలు జరగడంతో ఈవో పెద్దిరాజు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆలయములో ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేయగా, మరో ఇద్దరికి ఛార్జి మెమోలు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలమేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈఓ పెద్దిరాజు. రాహు కేతు పూజలకు సరైన సమయానికి నాగ పడగలు…
ఏపీలో మండిపోతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు. ముఖ్యంగా వంటగదిలో ఎక్కువగా వాడే ఆయిల్ ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు కిరాణా వ్యాపారులు. తిరుపతిలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. అధిక మొత్త0తో వంటనూనెలు అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడుతున్న దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా నూనె ప్యాకెట్ ల నిల్వ, నూనె ప్యాకెట్లపై అధిక రేట్లతో స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నట్టు…