APSRTC: తిరుమల-తిరుపతి మధ్య భారీగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీజిల్ సెస్ పేరుతో నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణ దూరాన్ని బట్టి కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.140కి పైగా ఆర్టీసీ డీజిల్ సెస్ వసూలు చేయనుంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ల ప్రతిపాదికన మొత్తం ఛార్జీని నిర్ణయించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో కనీస ఛార్జీలను ఆర్టీసీ పెంచింది. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.5 మేర పెంచగా.. దూరప్రాంత, ఏసీ, నాన్ ఎసీ, స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.10 మేర పెంచింది. పల్లెవెలుగు,ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10 యథాతథంగా ఉంచింది.
కనీస ఛార్జీల పెంపుతో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.20గా, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.25గా, సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.40గా, ఇంద్ర బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50గా, గరుడ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50గా, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50గా, అమరావతి ఎసీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50గా, వెన్నెల స్లీపర్ బస్సుల్లోఇకపై కనీస ఛార్జీ రూ.80గా ఉండనున్నాయి.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
Read Also: Plastic Ban: నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్.. లేదంటే ఐదేళ్ల జైలు శిక్ష
అటు ఆర్టీసీ ఛార్జీల పెంపుతో తిరుపతి-తిరుమల మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ప్రతి టికెట్పై రూ.15 అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఛార్జీ రూ.75 ఉండగా ఛార్జీల పెంపు కారణంగా రూ.90గా మారింది. అటు పిల్లల టికెట్ ధర రూ.45 నుంచి రూ.50కి పెరిగింది. రానుపోను టికెట్ ధర గతంలో రూ.135 ఉండగా ఇప్పుడు రూ.160కి పెరిగింది. 2018లో తిరుపతి నుంచి తిరుమలకు టికెట్ రూ.50గా ఉండేది. గత నాలుగేళ్లలో ఏకంగా రూ.40 పెరిగింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!