Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!
- ఐసీసీ టోర్నీల్లో భారత్ స్థిరమైన ప్రదర్శన
- ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర
- 20 సార్లు సెమీఫైనల్స్కు భారత్
India Creates History with 20 ICC Tournament Semifinals: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే మెగా టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ లాంటి టోర్నీలలో స్థిరమైన ప్రదర్శన చేస్తేనే.. కప్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థిరమైన ప్రదర్శన కారణంగానే భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ఈ ఘనతతో ప్రపంచ క్రికెట్లో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటుకుంది. ఎన్నో సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన, బలమైన జట్టు సమతౌల్యం, కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఈ రికార్డుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
ఈ జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు ఉన్నాయి. ఐసీసీ టోర్నీల చరిత్రలో ఈ రెండు టీమ్స్ 18 సార్లు సెమీస్కు చేరాయి. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు 16 సార్లు సెమీఫైనల్ దశకు చేరాయి. దక్షిణాఫ్రికా 15 సార్లు సెమీస్కు చేరి ఈ కాబితాలో చోటు దక్కించుకుంది . శ్రీలంక, వెస్టిండీస్ జట్లు 11 సార్లు సెమీఫైనల్స్ చేరగా.. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా జట్లు ఒక్కసారి సెమీస్కు చేరుకున్నాయి. ఈ గణాంకాలు చూస్తే.. పెద్ద టోర్నీల్లో అనుభవం, జట్టు స్థిరత్వం ఎంత కీలకమో స్పష్టంగా అర్థమవుతుంది.
Also Read
- SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
- Viral: బిగ్ షాకింగ్... స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
- Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
Also Read: Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!
ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరడం అంటే పెద్ద సవాలే. భారత్ ఈ రికార్డు సాధించడం వెనుక ఆటగాళ్ల ప్రతిభ, విభిన్న ఫార్మాట్లలో సమర్థ ఆట, యువత-సీనియర్ల సమన్వయం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్లో ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా సెమీస్ చేరడం అంటే అది ఒక జట్టు స్థాయి, సామర్థ్యానికి ప్రతీక. ఈ రికార్డుతో భారత్ భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు సాధించగలదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!