Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!
- ఐసీసీ టోర్నీల్లో భారత్ స్థిరమైన ప్రదర్శన
- ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర
- 20 సార్లు సెమీఫైనల్స్కు భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Creates History with 20 ICC Tournament Semifinals: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే మెగా టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ లాంటి టోర్నీలలో స్థిరమైన ప్రదర్శన చేస్తేనే.. కప్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థిరమైన ప్రదర్శన కారణంగానే భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ఈ ఘనతతో ప్రపంచ క్రికెట్లో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటుకుంది. ఎన్నో సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన, బలమైన జట్టు సమతౌల్యం, కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఈ రికార్డుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
ఈ జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు ఉన్నాయి. ఐసీసీ టోర్నీల చరిత్రలో ఈ రెండు టీమ్స్ 18 సార్లు సెమీస్కు చేరాయి. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు 16 సార్లు సెమీఫైనల్ దశకు చేరాయి. దక్షిణాఫ్రికా 15 సార్లు సెమీస్కు చేరి ఈ కాబితాలో చోటు దక్కించుకుంది . శ్రీలంక, వెస్టిండీస్ జట్లు 11 సార్లు సెమీఫైనల్స్ చేరగా.. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా జట్లు ఒక్కసారి సెమీస్కు చేరుకున్నాయి. ఈ గణాంకాలు చూస్తే.. పెద్ద టోర్నీల్లో అనుభవం, జట్టు స్థిరత్వం ఎంత కీలకమో స్పష్టంగా అర్థమవుతుంది.
Also Read
- SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
Also Read: Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!
ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరడం అంటే పెద్ద సవాలే. భారత్ ఈ రికార్డు సాధించడం వెనుక ఆటగాళ్ల ప్రతిభ, విభిన్న ఫార్మాట్లలో సమర్థ ఆట, యువత-సీనియర్ల సమన్వయం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్లో ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా సెమీస్ చేరడం అంటే అది ఒక జట్టు స్థాయి, సామర్థ్యానికి ప్రతీక. ఈ రికార్డుతో భారత్ భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు సాధించగలదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!