Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!
- ఐసీసీ టోర్నీల్లో భారత్ స్థిరమైన ప్రదర్శన
- ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర
- 20 సార్లు సెమీఫైనల్స్కు భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Creates History with 20 ICC Tournament Semifinals: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే మెగా టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ లాంటి టోర్నీలలో స్థిరమైన ప్రదర్శన చేస్తేనే.. కప్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థిరమైన ప్రదర్శన కారణంగానే భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ఈ ఘనతతో ప్రపంచ క్రికెట్లో భారత్ తన ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటుకుంది. ఎన్నో సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన, బలమైన జట్టు సమతౌల్యం, కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఈ రికార్డుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
ఈ జాబితాలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు ఉన్నాయి. ఐసీసీ టోర్నీల చరిత్రలో ఈ రెండు టీమ్స్ 18 సార్లు సెమీస్కు చేరాయి. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు 16 సార్లు సెమీఫైనల్ దశకు చేరాయి. దక్షిణాఫ్రికా 15 సార్లు సెమీస్కు చేరి ఈ కాబితాలో చోటు దక్కించుకుంది . శ్రీలంక, వెస్టిండీస్ జట్లు 11 సార్లు సెమీఫైనల్స్ చేరగా.. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా జట్లు ఒక్కసారి సెమీస్కు చేరుకున్నాయి. ఈ గణాంకాలు చూస్తే.. పెద్ద టోర్నీల్లో అనుభవం, జట్టు స్థిరత్వం ఎంత కీలకమో స్పష్టంగా అర్థమవుతుంది.
Also Read
- Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
- Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
Also Read: Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!
ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరడం అంటే పెద్ద సవాలే. భారత్ ఈ రికార్డు సాధించడం వెనుక ఆటగాళ్ల ప్రతిభ, విభిన్న ఫార్మాట్లలో సమర్థ ఆట, యువత-సీనియర్ల సమన్వయం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్లో ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా సెమీస్ చేరడం అంటే అది ఒక జట్టు స్థాయి, సామర్థ్యానికి ప్రతీక. ఈ రికార్డుతో భారత్ భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు సాధించగలదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!