తిరుపతిని గ్రేటర్గా మార్చడంపై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలున్నాయా? కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ విషయంలో అసహనంగా ఉన్నారా? ఇక్కడ వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నది నిజమేనా? మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా జై కొట్టినా సమస్య ఎక్కడ వస్తోంది? ఎమ్మెల్యేలు ఎందుకు వ్యచిరేకిస్తున్నారు? జనం నుంచి ఉన్న అభ్యంతరాలేంటి? తిరుపతి మున్సిపాలిటీని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పెట్టిన ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవంగా జై కొట్టారు.…
NRI Arrest: గృహహింస కేసులో కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన ఎన్నారై జెస్వంత్ మనికొండ (36) ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (MPD) అధికారులు, సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంతో కలిసి దర్యాప్తు నిర్వహించి జెస్వంత్ను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై గృహహింసకు పాల్పడటంతో పాటు, కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వు ను ఉల్లంఘించినట్లుగా జెస్వంత్పై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల నివేదికల ప్రకారం,…
Tirupati: తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సీపీఆర్ విల్లాస్ వెనుక ఉన్న స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన ఏడుగురు యువకుల బృందం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇసుక దిబ్బలపై ఆడుకుంటూ నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. Liquor Shop Licence: మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు.. ఎన్ని వచ్చాయంటే? వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకులలో ప్రకాశ్ (17), చిన్న (15), తేజు…
నేడు ఎర్రవల్లి ఫామ్హౌస్లో BRS నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న కేసీఆర్. తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల. రేపు మధ్యాహ్నం…
Road Accident: ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు, అతని కూతురు మృతిచెందారు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతికి చెందిన వైద్యుడు కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో గుంటూరు బయల్దేరి వెళ్తుండగా.. తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిది.. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న కిషోర్…
తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫొటోలుతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు సుభాష్... వాణిజ్య పన్నులశాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్.. రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టులు పెట్టారు.
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. తిరుపతి టూ రాజమండ్రి.. రాజమండ్రి టూ తిరుపతికి అలయన్స్ ఎయిర్ సర్వీసు ప్రారంభించనున్నది. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. వారానికి మూడు రోజులు మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. వారంలో మంగళ, గురు,శని వారాల్లో సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల 40 ని.లకు రాజమండ్రి నుండి బయలుదేరి11 గంటల 20 నిమిషాలకు తిరుపతి చేరుకుంటారు. ఉదయం 7గంటల 40 నిమిషాలకు తిరుపతిలో…
Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పోటీ చేసి గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు తిరుపతి. ఆరణి శ్రీనివాసులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి జిల్లాలో పోటీ చేసింది ఒకే సీటు అయినా…ఎన్నికల టైంలో… ఆ గెలుపు సౌండ్ మాత్రం రాయలసీమ మొత్తంలో ప్రతిధ్వనించింది. చివరి నిమిషంలో సీటు దక్కినా… 60వేలకు పైగా భారీ మెజారిటీతో ఆరణి విజయం సొంతం చేసుకోవడం గురించి అప్పట్లో బాగా మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ…
తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... ఆ పార్టీదే పైచేయి అన్నట్టుగా ఉంటుంది. కానీ... గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో కలిసి పనిచేసిన తమ్ముళ్లు భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు. ఇక అప్పటినుంచి టెంపుల్ సిటీ టీడీపీ సీన్ మారిందని అంటున్నారు తమ్ముళ్లు.