Tirumala: భక్తులకు గుడ్న్యూస్.. నేటి నుంచే ఆన్లైన్లో తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల రిజిస్ట్రేషన్
- నేటి నుంచి తిరుమలలో ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ప్రక్రియ ప్రారంభం..
- డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం..
- టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. కుటుంబ సభ్యులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ పేర్కొనింది.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాక్ రక్షణ మంత్రి కీలక ప్రకటన
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
అయితే, ఇవాళ్టి (నవంబర్ 27) నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం కల్పించింది టీటీడీ. మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ లో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇక, డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలను భక్తులకు అందించబడతాయి.
Read Also: Girija Oak: పాపులారిటీతో పాటు వేధింపులు కూడా స్టార్ట్.. “వస్తావా? గంటకు రేటెంత?” అని అడుగుతున్నారు!
ఇక, వాట్సాప్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెంబర్ కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్, తెలుగు భాషలను సెలక్ట్ చేసుకుని.. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం మీరు ఎంచుకున్న భాషలో సర్వీసెస్ విండో ఓపెన్ అవుతుంది.. ఆ సర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ను సెలక్ట్ చేసుకోవాలి. టీటీడీ టెంపుల్ సర్వీసెస్ తెరిచిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనం (డిప్) రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని కన్ఫమ్ చేయాలి.. ఆ తర్వాత చిరునామా, పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
కాగా, ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయస్సు, లింగం, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.. ఆ తర్వాత మరోసారి వివరాలను సరి చూసుకుని సబ్మిట్ చేసేయాలి. అయితే, ఒక్కసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి అవకాశం ఉండదనే విషయాన్ని భక్తులు దృష్టిలో పెట్టుకోండి.. కానీ, ఆధార్ కార్డు, పిన్ నంబర్లను తప్పుగా ఎంటర్ చేస్తే మార్చుకునే అవకాశం కల్పించారు. భక్తులు సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఆ మెసేజును రిఫరెన్స్ నంబరుగా దగ్గర పెట్టుకోవాలి. అలాగే, శ్రీవారి భక్తులు ఇక్కడ మరో విషయాన్ని మార్చిపోవద్దు.. ఒక మొబైల్ నెంబర్, ఒక ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే ఛాన్స్ ఉంటుందని టీటీడీ తెలియజేసింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..