Kandula Durgesh: మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం
- సీప్లేన్ సేవలకు వయబిలిటీ సమస్య ఉంది..
- వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా సీప్లేన్ సేవలను ప్రారంభిస్తాం..
- మ్యూజిక్ టూరిజం, టెంపుల్, ట్రెక్కింగ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిని కొత్త దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రధాన చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన NTVతో మాట్లాడుతూ.. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్ర పర్యాటకం పూర్తిగా మారేలా అనేక కీలక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని తెలిపారు. అలాగే, సీప్లేన్ కు వయబిలిటీ సమస్య ఉన్నప్పటికీ, వయబిలిటీని గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇప్పటికే చర్చలు జరిపి, కేంద్ర సహకారంతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
Read Also: Indigo: క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటున్న ఇండిగో, ఎయిర్ పోర్ట్లో ప్రయాణికులు ఫైర్ !
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
ఇక, గోదావరి నుంచి సీప్లేన్ లు తయారు చేసి నడిపిస్తామని మంత్రి దుర్గేష్ తెలియజేశారు. 2026 జూన్ జులై నుంచి సీప్లేన్ ను తీసుకొస్తాం.. క్రూజ్ తీసుకురావడానికి క్రెడిలాతో మాట్లాడాం.. గోదావరి, కృష్ణాల నుంచి క్రూజ్ లు ఇవ్వాలని అడిగాం.. ఎంఓయూలపై ప్రతి 15 రోజులకు సీఎం ఒక రివ్యూ చేస్తారు.. 2019-24 మధ్య ఉన్న ప్రభుత్వం లాగా సుష్క వాగ్దానాలు చేయకుండా కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అలాగే, మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.. తిరుపతి, విశాఖ, అమరావతి హబ్ లుగా పర్యటక అభివృద్ధికి 25 వేల కోట్ల ప్రాజెక్టులు తెచ్చాం.. భవానీ ద్వీపంలో థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి, వైజాగ్ లోని విశ్వనాథన్ తో ఎంఓయూ కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. అయితే, టెంపుల్ టూరిజం నుంచే మనకు ఎక్కువ మంది వస్తున్నారు అని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలలో హయత్, అట్మాస్ఫియర్ కోర్, తాజ్, ఓబెరాయ్ వంటి హోటల్స్ వస్తున్నాయి.. అలాగే, వెల్నెస్ టూరిజం కోసం బాబా రాందేవ్ తో కూడా ఎంఓయూ చేసుకున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!