Kandula Durgesh: మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం
- సీప్లేన్ సేవలకు వయబిలిటీ సమస్య ఉంది..
- వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా సీప్లేన్ సేవలను ప్రారంభిస్తాం..
- మ్యూజిక్ టూరిజం, టెంపుల్, ట్రెక్కింగ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిని కొత్త దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రధాన చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన NTVతో మాట్లాడుతూ.. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్ర పర్యాటకం పూర్తిగా మారేలా అనేక కీలక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని తెలిపారు. అలాగే, సీప్లేన్ కు వయబిలిటీ సమస్య ఉన్నప్పటికీ, వయబిలిటీని గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇప్పటికే చర్చలు జరిపి, కేంద్ర సహకారంతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
Read Also: Indigo: క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటున్న ఇండిగో, ఎయిర్ పోర్ట్లో ప్రయాణికులు ఫైర్ !
Also Read
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
ఇక, గోదావరి నుంచి సీప్లేన్ లు తయారు చేసి నడిపిస్తామని మంత్రి దుర్గేష్ తెలియజేశారు. 2026 జూన్ జులై నుంచి సీప్లేన్ ను తీసుకొస్తాం.. క్రూజ్ తీసుకురావడానికి క్రెడిలాతో మాట్లాడాం.. గోదావరి, కృష్ణాల నుంచి క్రూజ్ లు ఇవ్వాలని అడిగాం.. ఎంఓయూలపై ప్రతి 15 రోజులకు సీఎం ఒక రివ్యూ చేస్తారు.. 2019-24 మధ్య ఉన్న ప్రభుత్వం లాగా సుష్క వాగ్దానాలు చేయకుండా కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అలాగే, మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.. తిరుపతి, విశాఖ, అమరావతి హబ్ లుగా పర్యటక అభివృద్ధికి 25 వేల కోట్ల ప్రాజెక్టులు తెచ్చాం.. భవానీ ద్వీపంలో థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి, వైజాగ్ లోని విశ్వనాథన్ తో ఎంఓయూ కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. అయితే, టెంపుల్ టూరిజం నుంచే మనకు ఎక్కువ మంది వస్తున్నారు అని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలలో హయత్, అట్మాస్ఫియర్ కోర్, తాజ్, ఓబెరాయ్ వంటి హోటల్స్ వస్తున్నాయి.. అలాగే, వెల్నెస్ టూరిజం కోసం బాబా రాందేవ్ తో కూడా ఎంఓయూ చేసుకున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!