Kandula Durgesh: మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం
- సీప్లేన్ సేవలకు వయబిలిటీ సమస్య ఉంది..
- వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా సీప్లేన్ సేవలను ప్రారంభిస్తాం..
- మ్యూజిక్ టూరిజం, టెంపుల్, ట్రెక్కింగ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిని కొత్త దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రధాన చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన NTVతో మాట్లాడుతూ.. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్ర పర్యాటకం పూర్తిగా మారేలా అనేక కీలక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని తెలిపారు. అలాగే, సీప్లేన్ కు వయబిలిటీ సమస్య ఉన్నప్పటికీ, వయబిలిటీని గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇప్పటికే చర్చలు జరిపి, కేంద్ర సహకారంతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
Read Also: Indigo: క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటున్న ఇండిగో, ఎయిర్ పోర్ట్లో ప్రయాణికులు ఫైర్ !
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ఇక, గోదావరి నుంచి సీప్లేన్ లు తయారు చేసి నడిపిస్తామని మంత్రి దుర్గేష్ తెలియజేశారు. 2026 జూన్ జులై నుంచి సీప్లేన్ ను తీసుకొస్తాం.. క్రూజ్ తీసుకురావడానికి క్రెడిలాతో మాట్లాడాం.. గోదావరి, కృష్ణాల నుంచి క్రూజ్ లు ఇవ్వాలని అడిగాం.. ఎంఓయూలపై ప్రతి 15 రోజులకు సీఎం ఒక రివ్యూ చేస్తారు.. 2019-24 మధ్య ఉన్న ప్రభుత్వం లాగా సుష్క వాగ్దానాలు చేయకుండా కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అలాగే, మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.. తిరుపతి, విశాఖ, అమరావతి హబ్ లుగా పర్యటక అభివృద్ధికి 25 వేల కోట్ల ప్రాజెక్టులు తెచ్చాం.. భవానీ ద్వీపంలో థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి, వైజాగ్ లోని విశ్వనాథన్ తో ఎంఓయూ కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. అయితే, టెంపుల్ టూరిజం నుంచే మనకు ఎక్కువ మంది వస్తున్నారు అని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలలో హయత్, అట్మాస్ఫియర్ కోర్, తాజ్, ఓబెరాయ్ వంటి హోటల్స్ వస్తున్నాయి.. అలాగే, వెల్నెస్ టూరిజం కోసం బాబా రాందేవ్ తో కూడా ఎంఓయూ చేసుకున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!