Tirupati : తిరుమలకు మరో అరుదైన రికార్డ్
- ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీవారి వైభవం
- 3.45 లక్షల మంది భక్తులతో తిరుమల కిటకిట
- అన్నప్రసాదంలో టీటీడీ సరికొత్త రికార్డు
- భద్రత, సౌకర్యాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యజయంతి రోజైన రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర, రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు నిరంతరాయంగా కొనసాగింది. చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మాడ వీధుల్లో మలయప్ప స్వామి విహరిస్తుంటే భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోయారు. సుమారు 3.45 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండి ఈ వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించారు. కేవలం భక్తులే కాకుండా, రికార్డు స్థాయిలో 14,500 వాహనాలు ఈ ఒక్క రోజే తిరుమల కొండకు చేరుకోవడం విశేషం.
T20 world cup: టీ20 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు.. లిస్ట్ లో ఎవరెవరున్నారంటే?
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాద విభాగం మునుపెన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేసింది. గ్యాలరీల్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా ఆహారం, నీరు అందించింది. ఈ ఏడాది రథసప్తమి రోజున మొత్తం 9.42 లక్షల మందికి అన్నప్రసాదాలను పంపిణీ చేసి టీటీడీ రికార్డు సృష్టించింది. కేవలం భోజనం మాత్రమే కాకుండా, సుమారు 6.41 లక్షల మందికి కాఫీ, టీ, పాలు , టిఫిన్లను పంపిణీ చేశారు. ఎండ వేడిని తట్టుకునేలా భక్తులకు దాదాపు 4 లక్షల వాటర్ బాటిళ్లను ఉచితంగా అందజేయడం టీటీడీ సేవా నిరతికి నిదర్శనంగా నిలిచింది.
వేలాది మంది శ్రీవారి సేవకులు , టీటీడీ సిబ్బంది సమన్వయంతో ఈ వేడుకను విజయవంతం చేశారు. గ్యాలరీల్లో భక్తులకు ఎండ తగలకుండా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, క్యూ లైన్లలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ సరఫరా చేశారు. టీటీడీ ఈఓ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూశారు. ఆధ్యాత్మిక ఉత్సవాలతో పాటు భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేసిన ఈ భారీ ఏర్పాట్లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. తిరుమల చరిత్రలో అత్యంత క్రమశిక్షణతో , వైభవంగా జరిగిన రథసప్తమి వేడుకల్లో ఇది ఒకటిగా నిలిచిపోనుంది.
KING Nagarjuna : 100 వ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కింగ్
తాజావార్తలు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!