దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ మోసాల గురించి నిత్యం ప్రజలను హెచ్చరించినా.. ప్రతీ రోజు అలాంటి వాటికి బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ గురించి హెచ్చరిస్తుంటే.. మోసగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా బలహీనమైన డిమాండ్, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గిన కారణంగా భారత్లో డీజిల్ అమ్మకాలు సెప్టెంబరులో క్షీణించాయి . ఈమేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల ప్రాథమిక డేటా వెల్లడించింది.
బీసీసీఐ.. 'X' (Twitter) ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఇందులో రజనీకాంత్కి జై షా గోల్డెన్ టికెట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘గౌరవనీయులైన బీసీసీఐ సెక్రటరీ జై షా రజనీకాంత్కు గోల్డెన్ టికెట్ ఇచ్చి సత్కరించారు’ అని ఫోటోతో పాటు క్యాప్షన్ రాసింది.
రైలు ఢీకొని రెండు మొసళ్లు చనిపోయిన ఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్లో జరిగింది. బగాహా-వాల్మీకినగర్ రోడ్ రైల్వే స్టేషన్ మధ్య మంగళ్పూర్ ఔసాని హాల్ట్ సమీపంలో మొసళ్లను రైలు ఢీకొనడం కనిపెట్టారు. దీంతో వెంటనే రైల్వే సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవమైన ప్రదర్శన చూపించడంతో ఆ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆసియా కప్ లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ చేరుకోలేదు. దీంతో ఇప్పుడు వన్డే ప్రపంచకప్లో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును ప్రకటించారు. అయితే ఈ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ టీమిండియా వన్డే జట్టులోకి వచ్చాడు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.