Dimple Yadav: ఓబీసీ, మైనారిటీ మహిళలు కూడా రిజర్వేషన్ల నుంచి ప్రయోజనం పొందాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dimple Yadav: లోక్సభలో బుధవారం జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో పాల్గొన్న సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు డింపుల్ యాదవ్.. ఇతర వెనుకబడిన కులాలు, మైనారిటీలకు చెందిన మహిళలు దాని నుంచి ప్రయోజనం పొందడం చాలా ముఖ్యమని అన్నారు. విప్లవం లేకుండా, పరిణామం సాధ్యం కాదన్న డింపుల్ యాదవ్.. మన దేశంలో పరిణామం జరగాలంటే ఓబీసీ, ఎస్సీ, మైనారిటీలకు చెందిన మహిళలు రిజర్వేషన్లు పొందడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
Also Read: India: ప్రయాణాలు మానుకోండి.. కెనడాలోని భారత విద్యార్థులకు విదేశీ మంత్రిత్వ శాఖ హెచ్చరిక
Also Read
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
వెనుకబడిన తరగతి, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. లోక్సభ, విధానసభలతో పాటు రాజ్యసభ, శాసనమండలిలో కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తుందా అని తాను అడగాలనుకుంటున్నాని ఆమె అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేస్తారా అని కూడా ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో గురువారం జరిగిన చర్చలో మోడీ సర్కార్ను నిలదీశారుఎస్పీ నేత డింపుల్ యాదవ్. మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని ఆరోపించారు. పదేండ్లుగా ఎన్నడూ లేనిది ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా మహిళలు ఎందుకు గుర్తుకువచ్చారని ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలకు ముందే మోడీ సర్కార్కు మహిళలు గుర్తుకువచ్చారని ఎద్దేవా చేశారు.
Also Read: Womens Reservation Bill: 16 రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది.. కానీ ఒక్క మహిళా సీఎం లేరు
ఇంకా, ప్రభుత్వం దశాబ్దాల జనాభా గణనను ఎప్పుడు ప్రారంభిస్తుందని, అదనంగా ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనాభా గణనను చేయబోతుందా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టబడినట్లుగా, ప్రస్తుత రూపంలో ఉన్న కొత్త మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాల జనాభా గణన, నియోజకవర్గాల విభజన పూర్తయిన తర్వాత అమలులోకి వస్తుందని చెప్పారు. 2021లో జరగాల్సిన దశాబ్దాల జనాభా గణన ఇంకా ప్రారంభం కాలేదు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నారీ శక్తి వందన్ బిల్లు అధినియం 2023ని మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో సభ తొలి సమావేశం సందర్భంగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబరు 21న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు కోటాకు 33 హామీని ఇస్తుంది. పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ అనేది బీజేపీతో సహా అనేక పార్టీల వాగ్ధానం.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!