Womens Reservation Bill: 16 రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది.. కానీ ఒక్క మహిళా సీఎం లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens Reservation Bill: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు కకోలి ఘోష్ దస్తిదార్ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేరని ఆమె విమర్శలు గుప్పించారు. కకోలి ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉందని, రెండోసారి అధికారంలోకి వచ్చిన చివరి సంవత్సరంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
“వారికి ఇంత సమయం పట్టిందేమిటి? 2014లో ఈ బిల్లు ఎందుకు తీసుకురాలేదు? ఎన్నికల ముందు ఎందుకు? ప్రజలకు ఏమి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు? ఇది వారి టోపీ నుంచి కుందేలును తీసి దేశం ముందు ఉంచినట్లుగా ఉంది?” అని లోక్సభలో ఆమె అడిగింది. పార్టీ నాయకురాలు మమతా బెనర్జీని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ఆమె అన్నారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మహిళా ముఖ్యమంత్రి లేరు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ఈ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన రెజ్లర్ల నిరసనను దస్తిదార్ ప్రస్తావించారు. మహిళలను అగౌరవపరిచే వారిపై తగిన చర్యలు తీసుకోవడం, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు.”మేము ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కువ మంది మహిళలను కలిగి ఉన్నాము. లోక్సభలో 2014 నుంచి పార్లమెంటరీ విధానం ద్వారా లేదా ఎన్నికల సంఘం ద్వారా ఎటువంటి రిజర్వేషన్లు అమలు చేయబడకుండానే పార్టీలో 33 శాతానికి పైగా రిజర్వేషన్లను కలిగి ఉన్నాము” అని ఆమె అన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నారీ శక్తి వందన్ బిల్లు 2023ని మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో సభ తొలి సమావేశం సందర్భంగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబరు 21న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!