Womens Reservation Bill: 16 రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది.. కానీ ఒక్క మహిళా సీఎం లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens Reservation Bill: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు కకోలి ఘోష్ దస్తిదార్ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేరని ఆమె విమర్శలు గుప్పించారు. కకోలి ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉందని, రెండోసారి అధికారంలోకి వచ్చిన చివరి సంవత్సరంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
“వారికి ఇంత సమయం పట్టిందేమిటి? 2014లో ఈ బిల్లు ఎందుకు తీసుకురాలేదు? ఎన్నికల ముందు ఎందుకు? ప్రజలకు ఏమి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు? ఇది వారి టోపీ నుంచి కుందేలును తీసి దేశం ముందు ఉంచినట్లుగా ఉంది?” అని లోక్సభలో ఆమె అడిగింది. పార్టీ నాయకురాలు మమతా బెనర్జీని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ఆమె అన్నారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మహిళా ముఖ్యమంత్రి లేరు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
Also Read
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
ఈ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన రెజ్లర్ల నిరసనను దస్తిదార్ ప్రస్తావించారు. మహిళలను అగౌరవపరిచే వారిపై తగిన చర్యలు తీసుకోవడం, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు.”మేము ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కువ మంది మహిళలను కలిగి ఉన్నాము. లోక్సభలో 2014 నుంచి పార్లమెంటరీ విధానం ద్వారా లేదా ఎన్నికల సంఘం ద్వారా ఎటువంటి రిజర్వేషన్లు అమలు చేయబడకుండానే పార్టీలో 33 శాతానికి పైగా రిజర్వేషన్లను కలిగి ఉన్నాము” అని ఆమె అన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నారీ శక్తి వందన్ బిల్లు 2023ని మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో సభ తొలి సమావేశం సందర్భంగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబరు 21న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!