Womens Reservation Bill: 16 రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది.. కానీ ఒక్క మహిళా సీఎం లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens Reservation Bill: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు కకోలి ఘోష్ దస్తిదార్ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేరని ఆమె విమర్శలు గుప్పించారు. కకోలి ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉందని, రెండోసారి అధికారంలోకి వచ్చిన చివరి సంవత్సరంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
“వారికి ఇంత సమయం పట్టిందేమిటి? 2014లో ఈ బిల్లు ఎందుకు తీసుకురాలేదు? ఎన్నికల ముందు ఎందుకు? ప్రజలకు ఏమి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు? ఇది వారి టోపీ నుంచి కుందేలును తీసి దేశం ముందు ఉంచినట్లుగా ఉంది?” అని లోక్సభలో ఆమె అడిగింది. పార్టీ నాయకురాలు మమతా బెనర్జీని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ఆమె అన్నారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మహిళా ముఖ్యమంత్రి లేరు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ఈ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన రెజ్లర్ల నిరసనను దస్తిదార్ ప్రస్తావించారు. మహిళలను అగౌరవపరిచే వారిపై తగిన చర్యలు తీసుకోవడం, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు.”మేము ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కువ మంది మహిళలను కలిగి ఉన్నాము. లోక్సభలో 2014 నుంచి పార్లమెంటరీ విధానం ద్వారా లేదా ఎన్నికల సంఘం ద్వారా ఎటువంటి రిజర్వేషన్లు అమలు చేయబడకుండానే పార్టీలో 33 శాతానికి పైగా రిజర్వేషన్లను కలిగి ఉన్నాము” అని ఆమె అన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నారీ శక్తి వందన్ బిల్లు 2023ని మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో సభ తొలి సమావేశం సందర్భంగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబరు 21న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!