ప్రతి మనసులో రాతగాడు దాగుంటాడో లేదో కానీ, ప్రతి మనిషిలో ఓ పాటగాడు మాత్రం తప్పనిసరిగా ఉంటాడు అంటారు మానసిక నిపుణులు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందరూ కూనిరాగాలు తీసేవారే. చివరకు బుద్ధిమాంద్యం ఉన్నవారిలోనూ పాట పాడాలనే తలంపు ఉంటుందనీ చెబుతారు. నేడు గీత రచయితగా తనదైన పంథాలో పయనిస్తున్న చంద్రబోస్ చదువుకున్నది ఇంజనీరింగ్. గాయకుడు కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. కానీ, చిత్రంగా వందలాది మంది గాయకుల నోట తన పాటను పలికించే స్థాయికి చేరుకున్నారాయన.…
నటరత్న యన్.టి.రామారావు చిత్రసీమలో ప్రవేశించక మునుపు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ‘జానపద చిత్రాల కథానాయకుని’గా ఓ వెలుగు వెలిగారు. తరువాతి రోజుల్లో అత్యధిక జానపదాల్లో నటించిన ఘనతను యన్టీఆర్ సొంతం చేసుకోగా, ఏయన్నార్ సాంఘిక చిత్రాలతో ముందుకు సాగారు. యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ రామారావుకు తొలి జానపద చిత్రం కావడం విశేషం. ఇక వారిద్దరూ నటించిన తరువాతి సినిమా ‘సంసారం’ ఏయన్నార్ కు మొట్టమొదటి సాంఘిక చిత్రం కావడం ఇంకో…
‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిన నరేష్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘అల్లరి’ సినిమా విడుదలై మే 10వ తేదీకి ఇరవై సంవత్సరాలు అవుతోంది. హీరోగా నరేష్ కు, దర్శకునిగా రవిబాబుకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ‘అల్లరి’ చిత్రం 2002 మే 10న విడుదలయింది. ‘అల్లరి’ చిత్రం కథ ఏమిటంటే – రవి, అపర్ణ చిన్ననాటి స్నేహితులు. ఒకే అపార్ట్ మెంట్స్ లో ఉంటారు. రుచి అనే అమ్మాయి వాళ్ళుండే అపార్ట్ మెంట్స్ లో…
‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న లక్ష్య ప్రస్తుతం ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’, ‘ధీర’ సినిమాల్లో నటిస్తున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పి. సి. సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్…
నిండైన విగ్రహంతో విలన్ గా జడిపించి, కమెడియన్ గా కితకితలు పెట్టి, కొన్నిసార్లు సెంటిమెంట్ నూ పండించి జనాన్ని ఆకట్టుకున్నారు చలపతిరావు. అనేక ప్రేమకథా చిత్రాల్లో అమ్మాయికో, అబ్బాయికో తండ్రిగా నటించి అలరించారాయన. చిత్రసీమలో ఎంతోమంది ‘బాబాయ్’ అంటూ చలపతిరావు ను అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇక నటరత్న యన్టీఆర్ తనయులు నిజంగానే ‘బాబాయ్’లా చూసుకుంటూ ఉంటారు. ఆయన తనయుడు రవిబాబు సైతం తండ్రి బాటలో పయనిస్తూ నటునిగా మారినా, తరువాత మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గానూ…
తెలుగు చిత్రసీమలో నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీరి కాంబోలో తెరకెక్కిన ఐదు చిత్రాలలో నాలుగు వరుసగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ సినిమా 1992 మే 7న విడుదలై విజయఢంకా మోగించింది. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో బి.గోపాల్ రూపొందించిన ‘లారీ డ్రైవర్’ సైతం సూపర్ హిట్ గా నిలచింది.…
దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన అనేక చిత్రాలలో స్త్రీల సమస్యలను చర్చిస్తూ వాటికి తగిన పరిష్కారాలు చూపించారు. తమిళంలో అదే తీరున కె.బాలచందర్ సాగారు. బాలచందర్ రూపొందించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రాన్ని తెలుగులో దాసరి నారాయణరావు ‘తూర్పు-పడమర’గా రీమేక్ చేశారు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రంతో శ్రీవిద్య, నరసింహరాజుకు మంచి పేరు లభించింది. ఆ సినిమా విడుదలైన ఆరు నెలలకు దాసరి తన సొంత కథతో రూపొందించిన చిత్రం ‘కన్య-కుమారి’. ఇందులో కన్యగా జయమాలిని,…
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్.. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే వార్త.. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవర్ స్టార్ ప్రస్తుతం.. క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. పవర్ స్టార్ రాబిన్ హుడ్…
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఇప్పటికే మహేష్ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అయితే దాని కంటే ముందే.. ప్రీరిలీజ్ ఈవెంట్లో మహేష్ మాటలు వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి అఫిషీయల్ అనౌన్మ్సెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే.. మే 7న ఈ ఈవెంట్ డేట్ను లాక్…
ఎన్టీఆర్-సాయి పల్లవి.. ఈ క్రేజి కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. అదిరిపోయే స్టెప్పులతో థియేటర్ దద్దరిల్లిపోతుందనడంలో ఎలా సందేహం లేదు. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ తర్వాత పల్లవి మరో సినిమాకు కమిట్ అవలేదు. దాంతో ఇక ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతోందని జోరుగా వినిపించింది.…