అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం, ‘మహానటి’ డైరెక్టర్ అనగానే అతని పేరు చెప్పేస్తున్నారు. అంతలా పాపులర్ అయిన నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్, దీపికా పదుకొణేతో…
యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది. సైమా, ఆహా పురస్కార వేడుకల్లో బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డులు అందుకున్న లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ‘కలర్ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల…
‘అన్నీ మంచి శకునములే’ అనే ఓల్డ్ సాంగ్ ను నేచురల్ స్టార్ నాని హ్యాపీగా హమ్ చేసుకోవచ్చు. ఈ మధ్య నాని సినిమాలు పెద్దంతగా బాక్సాఫీస్ దగ్గర హంగామా సృష్టించకపోయినా… అతని మీద తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఆదరాభిమానాల్లో ఎలాంటి మార్పూ లేదు. అందుకు తాజాగా నిన్న విడుదలైన ‘అంటే సుందరానికీ…’ టీజర్ కు లభిస్తున్న ఆదరణను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ హవా ఇలా వీస్తుండగానే మరో రికార్డ్ ఒకటి నాని ఖాతాలో జమ అయ్యింది. నాని,…
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. సెట్స్ పైన పలు చిత్రాలు వివిధ దశల్లో ఉండగానే ఈ రోజు విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో కొత్త సినిమాను ప్రారంభించింది. విశేషం ఏమంటే… ఈ నిర్మాణ సంస్థ నిన్నటి నుండి ఓ రకంగా విజయోత్సవాన్ని జరుపుకుంటోంది. బుధవారం నేచురల్ స్టార్ నానితో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఆ వేదికపైనే నాని…
‘నువ్వు నేను ఒక్కటవుదాం’, ‘జువ్వ’ చిత్రాలలో హీరోగా నటించిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు రంజిత్ సోమి తాజా చిత్రం ‘లెహరాయి’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ లోగోను గురువారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘లెహరాయి’ సినిమాను రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. ఇదే వేదికపై ఫస్ట్…
‘కేజీఎఫ్-2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలచింది మొదలు అన్ని భాషల్లోనూ గణనీయమైన వసూళ్ళు చూస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఓ వెయ్యి కోట్ల రూపాయలు పోగేస్తుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఈ సినిమా ‘బాహుబలి-2’ను అధిగమిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అది కలలోని మాటే అని చెప్పాలి. ఎందుకంటే ‘బాహుబలి-2’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఎటు చూసినా ‘కేజీఎఫ్-2’ కు అంత సీన్ లేదని తెలుస్తోంది. అయితే బాలీవుడ్…
ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో మన తెలుగువాడయిన ఎస్.ఎస్.రాజమౌళి పేరు మారుమోగి పోతోంది. తన తాజా చిత్రం ‘ట్రిపుల్ ఆర్’తో రాజమౌళి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి దాకా ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1084 కోట్లు పోగేసింది. భారతదేశంలో విడుదలైన అన్ని భాషల్లో కలిపి ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం రూ. 880.4 కోట్లు మూటకట్టింది. ఇక విదేశాలలో ఈ సినిమా రూ.203.6 కోట్లు రాబట్టింది. వెరసి మొత్తం రూ.1084 కోట్లు కొల్లగొట్టి, ఈ యేడాది…
రచయితల టైటిల్ కార్డ్ చూసి కూడా జనం చప్పట్లు కొట్టే రోజులు అప్పట్లోనే ఉండేవి. అలా చప్పట్లు కొట్టించుకున్న రచయితల్లో త్రిపురనేని మహారథి సైతం చోటు సంపాదించారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ‘నేరుగా కథ చెప్పడమే’ ప్రధానంగా ఉండేది. కానీ, అందులోనూ స్క్రీన్ ప్లే ను చొప్పించి మరింత రంజింప చేయవచ్చునని కొందరు రచయితలు తలచారు. వీరందరూ పాశ్చాత్య చిత్రాల ప్రభావంతో అలా రాస్తున్నారనీ కొందరు విమర్శించేవారు. అయితే భవిష్యత్ లో ‘స్క్రీన్ ప్లే’కు విశేషమైన స్థానం…
’30 వెడ్స్ 21′ సీజన్ 2 లో చూస్తుండగానే 6వ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. నిజానికి ఈ సీజన్ లో కథ కంటే కథనానికే దర్శకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే గత ఎపిసోడ్స్ కు కాస్తంత భిన్నంగా ఈ 6వ ఎపిసోడ్ సాగింది. వ్యూవర్స్ ఊహకు చిక్కకుండా కథను డైరెక్టర్ పరుగులు తీయించాడు. ‘సారీ పృథ్వీ’ పేరుతో స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ ఆసక్తికరంగా సాగింది. లాస్ట్ ఎపిసోడ్ లో తన…
చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు కశ్మీర్ లో నిర్మించిన మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రోజ్ గార్డెన్’. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, హీరో నితిన్ నాష్, దర్శకుడు రవికుమార్ పాల్గొన్నారు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్…