Dasari :నలభై ఐదేళ్ళ ‘కన్య – కుమారి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన అనేక చిత్రాలలో స్త్రీల సమస్యలను చర్చిస్తూ వాటికి తగిన పరిష్కారాలు చూపించారు. తమిళంలో అదే తీరున కె.బాలచందర్ సాగారు. బాలచందర్ రూపొందించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రాన్ని తెలుగులో దాసరి నారాయణరావు ‘తూర్పు-పడమర’గా రీమేక్ చేశారు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రంతో శ్రీవిద్య, నరసింహరాజుకు మంచి పేరు లభించింది. ఆ సినిమా విడుదలైన ఆరు నెలలకు దాసరి తన సొంత కథతో రూపొందించిన చిత్రం ‘కన్య-కుమారి’. ఇందులో కన్యగా జయమాలిని, కుమారిగా శ్రీవిద్య నటించారు. కీలక పాత్రను నరసింహరాజు పోషించారు. మరో ముఖ్యపాత్రలో దాసరి నారాయణ రావు కనిపించారు. 1977 మే 6న విడుదలైన ‘కన్య-కుమారి’ చిత్రంతోనే ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకునిగా పరిచయం కావడం విశేషం!
‘కన్య-కుమారి’లోని కథానాయకుని పాత్ర ప్లేబోయ్ లా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే బాలచందర్ ‘అంతులేని కథ’లో ఫటాఫట్ జయలక్ష్మి ధరించిన పాత్రకు మేల్ వర్షన్ అనుకోవచ్చు. అతని ఆగమనంతో నిశ్చలమైన నదిలాంటి కన్య జీవితంలో కలిగింది సంచలనం… గలగలపారే సెలయేరు లాంటి కుమారి జీవితంలో నిలచింది గమనం… ఈ రెండు జీవితాల కథాసంకలనం ‘కన్య-కుమారి’ అని దాసరి సెలవిస్తూ ఈ సినిమాను రూపొందించారు. చివరకు వయసులో కాస్త పెద్దదైన కుమారి ‘కన్య’ జీవితానికి న్యాయం జరగాలని తాను తప్పుకుంటుంది. అంటే గలగల పారుతూ మరో నదిలో కలవడానికి వెళ్తుందన్నమాట! అంతే తప్ప సముద్రుణ్ణి చూసుకోదు.
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
శ్రీవిద్య, జయమాలిని, దాసరి నారాయణరావు, నరసింహరాజు, శరత్ బాబు, రమాప్రభ, నిర్మల, రమాదేవి, గోకిన రామారావు, నారాయణ మూర్తి నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం దాసరి సమకూర్చారు. ఈ చిత్రాన్ని జయ సరిగమ ఆర్ట్స్ పతాకంపై టి.కాశీ, పర్వతనేని నారాయణరావు నిర్మించారు. బాలు బాణీలకు సి.నారాయణ రెడ్డి, వేటూరి రాశారు. ఇందులోని “ఇది తొలిపాట…” అంటూ సాగే గీతాన్ని వేటూరి రాయగా, బాలు గానం చేస్తూ తొలిసారి రికార్డ్ చేశారు. ఇందులోని “చిలకల్లె నవ్వాలి…”, “నేను ఆ అన్నా…”, “శ్రీరస్తు శుభమస్తు….”, “రహస్యం తీయని రహస్యం…”, “తొలిసంధ్యకు తూరుపు ఎరుపు…” అంటూ మొదలయ్యే గీతాలూ ఆకట్టుకున్నాయి. ఇందులో దాసరి నారాయణరావు మతిమరపు ఉన్న పాత్రలో నవ్వులు పూయించడం విశేషం!
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!