మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే చంద్రబాబు సమీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్తో చర్చించారు. CM Jagan: వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్ చిత్తూరు, తిరుపతి పార్లమెంటుల పరిధిలోని నేతల పని తీరుపై చంద్రబాబుకు బీదా రవిచంద్ర…
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం చంద్రబాబును గ్రూప్-1 అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్-1 నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్లో 62శాతం వ్యత్యాసం ఉందన్నారు. డిజిటల్ మూల్యాoకానం, మాన్యువల్ మూల్యాంకనంలో 62 శాతం ఫలితాలు తేడా రావటమే…
ఏపీ జెన్కో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో టీడీపీ, సీపీఎం, సీపీఐ, కార్మిక సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ మేరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మోహన్ రావు, అంకయ్య, రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు…
ఏపీలో గ్రూప్-1 నిర్వహణలో గూడుపుఠాణీ జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్లో భారీ తేడాలు ఉన్నాయని.. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్, మాన్యువల్ వేల్యూయేషన్లో 202 మంది అవుటయ్యారన్నారు. స్పోర్ట్స్ కోటాలో కోతలు విధించడంతో ఆశావహులు ఆందోళనతో ఉన్నారని ఆరోపించారు. ఈ అవకతవకలపై గవర్నర్ దృష్టి సారించి న్యాయవిచారణ జరపాలని లోకేష్ కోరారు. గ్రూప్ 1 ఇంటర్య్వూల ఎంపికలో…
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనతో వైసీపీ పని అయిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో వార్ వన్సైడే ఉంటుందని స్పష్టం చేశారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు. అయితే టీడీపీలోగ్రూపు రాజకీయాలను ఇకపై సహించేది లేదంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఏ స్థాయిలోనూ గ్రూపులను సహించేది లేదని.. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవన్నారు. Telugu Desam Party: 2024…
టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన ఆమె మధ్యాహ్నానికి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్లతో మాట్లాడతానని ప్రకటించారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వచ్చిన ఓ పోస్టింగ్ ఆధారంగా తొలుత తాను పార్టీకి రాజీనామా చేశానని దివ్యవాణి వివరణ ఇచ్చారు. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్టుగా ఫేస్ బుక్లో…
తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. 72 ఏళ్ల చంద్రబాబు తన వయస్సు గురించిన ఆందోళనలను కూడా పక్కనబెట్టి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. వీలైనంత ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండేందుకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారు. వయస్సు గురించి ప్రస్తావిస్తే.. తన వయస్సు గురించి దిగులు చెందాల్సిన పనే లేదంటారాయన. ఆ మాటకొస్తే ప్రధాని మోదీది కూడా…
ఏపీలో వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై 1,116 అక్రమాల పేరుతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఛార్జిషీట్ విడుదల చేశారు. ఏపీలో విధ్వంసకర, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తోందని.. రివర్స్ టెండరింగ్ ఏపీని తిరోగమనంలోకి నెట్టిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ మంత్రులు నోరులేని మూగజీవులు అని చురకలు అంటించారు. కార్పొరేషన్లతో ఒక్కరికి ప్రయోజనం చేకూరిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కోనసీమ అల్లర్లు సీఎం జగన్ స్పాన్సర్…
ఒంగోలులో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ సాధించిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఉందో మహానాడుతో తేలిపోయిందని అచ్చె్న్నాయుడు పేర్కొన్నారు. మహానాడును విజయవంతం చేసిన వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. మహానాడు నిర్వహణకు స్థలం ఇచ్చి సహకరించిన మండువవారిపాలెం రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఒంగోలు సమీపంలో…
టీడీపీ మహానాడు వేదికపై వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ చేపడుతున్న బస్సు యాత్రలో వస్తోంది మంత్రులు కాదని.. అలీబాబా 40 దొంగలు అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులను ప్రజలు నిలదీయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారం అని తెలిపారు. ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలతోనే శిక్షలు విధించేలా న్యాయబద్దమైన, చట్టబద్దమైన అధికారాలు…