Somireddy: ఏపీ జెన్కో సంస్థను ఆదానీ పరం చేసేందుకు కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ జెన్కో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో టీడీపీ, సీపీఎం, సీపీఐ, కార్మిక సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ మేరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మోహన్ రావు, అంకయ్య, రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఏపీ జెన్కో సంస్థను ఆదానీ కంపెనీ పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. జెన్ కో ప్లాంట్లో ప్రమాదాన్ని ముందే హెచ్చరించిన అధికారులని బెదిరించారని మండిపడ్డారు. యాష్ పాండ్ ప్రమాదం వల్ల రెండు యూనిట్లు మూసేశారన్నారు. దీంతో రోజుకు రూ.10 కోట్ల నష్టం వస్తోందని సోమిరెడ్డి వివరించారు. ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఉప ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన పేర్కొన్నారు.
Also Read
Ambati Rambabu: చంద్రబాబు, దేవినేని ఉమాకు సవాల్.. చర్చకు సిద్ధమా?
అటు జెన్కో ప్లాంట్లో బూడిద తొట్టి వద్ద ప్రమాదానికి కారణం కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమేనని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో యాజమాన్యం తీరు వల్లే రూ.కోట్ల మేర నష్టం వాటిల్లిందని అఖిలపక్ష నేతలు తెలిపారు. వెంటనే మూడు యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
తాజావార్తలు
-
Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
-
Kedar Jadhav: సచిన్తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
-
Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్ బాద్షా గురించి ఆసక్తికర విషయాలు..
-
Kriti-Rashmika: రష్మిక గురించి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Axar Patel-DC: వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!