Somireddy: ఏపీ జెన్కో సంస్థను ఆదానీ పరం చేసేందుకు కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ జెన్కో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో టీడీపీ, సీపీఎం, సీపీఐ, కార్మిక సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ మేరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మోహన్ రావు, అంకయ్య, రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఏపీ జెన్కో సంస్థను ఆదానీ కంపెనీ పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. జెన్ కో ప్లాంట్లో ప్రమాదాన్ని ముందే హెచ్చరించిన అధికారులని బెదిరించారని మండిపడ్డారు. యాష్ పాండ్ ప్రమాదం వల్ల రెండు యూనిట్లు మూసేశారన్నారు. దీంతో రోజుకు రూ.10 కోట్ల నష్టం వస్తోందని సోమిరెడ్డి వివరించారు. ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఉప ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన పేర్కొన్నారు.
Also Read
- AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
- Pawan Kalyan: ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. అమరావతి అభివృద్ధిపై ఫోకస్.. వారికి గుడ్న్యూస్..!
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
Ambati Rambabu: చంద్రబాబు, దేవినేని ఉమాకు సవాల్.. చర్చకు సిద్ధమా?
అటు జెన్కో ప్లాంట్లో బూడిద తొట్టి వద్ద ప్రమాదానికి కారణం కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమేనని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో యాజమాన్యం తీరు వల్లే రూ.కోట్ల మేర నష్టం వాటిల్లిందని అఖిలపక్ష నేతలు తెలిపారు. వెంటనే మూడు యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
తాజావార్తలు
-
2026 Tata Harrier: టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. 13 JBL స్పీకర్లు, లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు
-
Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
-
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
-
BCCI: “చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు”.. గౌతమ్ గంభీర్పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
-
NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!