Andhra Pradesh: చంద్రబాబును కలిసిన గ్రూప్-1 అభ్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం చంద్రబాబును గ్రూప్-1 అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్-1 నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్లో 62శాతం వ్యత్యాసం ఉందన్నారు. డిజిటల్ మూల్యాoకానం, మాన్యువల్ మూల్యాంకనంలో 62 శాతం ఫలితాలు తేడా రావటమే అనుమానాలకు బలమిస్తోందని అభ్యర్థులు వాపోయారు.
మాన్యువల్ మూల్యాంకనంలో 80 శాతం తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని గ్రూప్-1 అభ్యర్థులు చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత నిర్వహించిన డిజిటల్ మూల్యాకంనంలో 326 మందిని అర్హులుగా ప్రకటించడంతో పాటు పారదర్శకంగా చేశామని.. హైకోర్టులో ఏపీపీఎస్సీ అఫిడవిట్ దాఖలు చేసిందని.. తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాoకనంలో 62 శాతం మంది డిజిటల్లో అర్హత పొందిన వారిని తొలగించారని వివరించారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,544 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్
అయితే ఈ పక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని ఏపీపీఎస్సీ చెప్తోందని.. డిజిటల్ మూల్యాంకనం లేదా మాన్యువల్ మూల్యాంకనంలో ఏది పారదర్శకంగా ఉందో తేలాలంటే న్యాయ విచారణ జరగాల్సిందేనని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలు హడావుడిగా నిర్వహించడంలో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో ఈ విధంగా హడావుడి ఇంటర్వ్యూల నిర్వహణతో చాలా మంది అభ్యర్థులు నష్టపోతారన్నారు. చంద్రబాబు తమ పోరాటానికి నైతిక మద్దతు ఇవ్వటంతో పాటు న్యాయ పరంగా అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!