Andhra Pradesh: చంద్రబాబును కలిసిన గ్రూప్-1 అభ్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం చంద్రబాబును గ్రూప్-1 అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్-1 నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్లో 62శాతం వ్యత్యాసం ఉందన్నారు. డిజిటల్ మూల్యాoకానం, మాన్యువల్ మూల్యాంకనంలో 62 శాతం ఫలితాలు తేడా రావటమే అనుమానాలకు బలమిస్తోందని అభ్యర్థులు వాపోయారు.
మాన్యువల్ మూల్యాంకనంలో 80 శాతం తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని గ్రూప్-1 అభ్యర్థులు చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత నిర్వహించిన డిజిటల్ మూల్యాకంనంలో 326 మందిని అర్హులుగా ప్రకటించడంతో పాటు పారదర్శకంగా చేశామని.. హైకోర్టులో ఏపీపీఎస్సీ అఫిడవిట్ దాఖలు చేసిందని.. తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాoకనంలో 62 శాతం మంది డిజిటల్లో అర్హత పొందిన వారిని తొలగించారని వివరించారు.
Also Read
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,544 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్
అయితే ఈ పక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని ఏపీపీఎస్సీ చెప్తోందని.. డిజిటల్ మూల్యాంకనం లేదా మాన్యువల్ మూల్యాంకనంలో ఏది పారదర్శకంగా ఉందో తేలాలంటే న్యాయ విచారణ జరగాల్సిందేనని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలు హడావుడిగా నిర్వహించడంలో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో ఈ విధంగా హడావుడి ఇంటర్వ్యూల నిర్వహణతో చాలా మంది అభ్యర్థులు నష్టపోతారన్నారు. చంద్రబాబు తమ పోరాటానికి నైతిక మద్దతు ఇవ్వటంతో పాటు న్యాయ పరంగా అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..