ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఎక్కువగా.. హైదరాబాద్పై ఫోకస్ చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, అలాగే బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు… ప్రకటించారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులు. బోనాలు,…
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,11,251 శాంపిల్స్ పరీక్షించగా.. 614 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో నలుగురు కోవిడ్ బాధితులు చనిపోయారు.. ఇదే మయంలో.. 657 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,330కి పెరగగా.. రికవరీ కేసులు 6,31,389కు చేరాయి.. ఇక, ఇప్పటి…
తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు, జాతీయ రహదారుల గుర్తింపు చేయాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి వినతి పత్రం అందించారు టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్య సభ ఎంపీల బృందం. అందులో… విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మించాలి. తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను గుర్తించాలని విన్నవించిన ఎంపీల బృందం… చౌటుప్పల్-షాద్ నగర్-కంది (RRR) – 186 KM…
ప్రజా దీవెన పాద యాత్రలో భాగంగా నేడు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మంత్రులకే దొరకని సీఎం ఎంపీటీసీ, సర్పంచ్ లతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మన దెబ్బ అలా ఉంది అన్నారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యే లు నా మీదకు వస్తున్నారు. ఇది గడ్డి పోస కాదు, గడ్డపార. పొలిసులకు కూడ వారి మనసులో ఈటెల రాజేందర్ గెలువాలని ఉంది. నేను అందరికి సహాయం చేసే వాడిని.…
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తీవ్రత, కరోనా థర్డ్ వేవ్ భయం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి తగిన మొత్తంలో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయని ఆసుపత్రులకు లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించింది. 200 వరకు బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుపత్రులు 500 ఎల్పీఎం కెపాసిటీ ఆక్సీజన్ జరరేషన్…
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నా జరిగింది. ఈ ధర్నాసభలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై పలు విమర్శలు చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ను, ఫామ్ హౌస్ను లక్ష నాగళ్లతో దున్నుతామని, ఆ భూమిని ప్రజలకు పంచుతామని అన్నారు. పోడు భూములను పరిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమిని…
ఒక్క ఉపఎన్నిక.. అక్కడి ఉమ్మడి జిల్లాలోని అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోందా? కలెక్టర్ నుంచి సీపీ వరకు ఆకస్మిక బదిలీల వెనక కారణాలు అవేనా? సీనియర్ ఐపీఎస్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! కరీంనగర్ సీపీ బదిలీపై రాజకీయ వర్గాల్లో చర్చ! తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక రాజకీయపార్టీల్లో సెగలు రేపుతుంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ అధికారుల కుర్చీలు కదిలిస్తోంది. కలెక్టర్లు.. ఐపీఎస్లను ఉన్నపళంగా బదిలీ…
కరోనా కారణంగా సినిమా థియేటర్లు చాలా కాలంగా మూతపడ్డాయి. సినిమా హాల్లో బొమ్మ పడి చాలా రోజులయింది. ఐతే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం.. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఇప్పటికే కొన్ని సినిమా టయేటర్లు ఓపెన్ అయినా ఇంకా బొమ్మ పడలేదు.. అంతే కాదు సినిమాలు రిలీజ్ చేయడానికి ఏగ్జిబిటర్లు ముందుకు రాలేదు.. దీంతో థియేటర్లు ఎక్కువగా తెరుచుకోలేదు.…