ఈటల సమక్షంలో బీజేపీలో చేరికలు.. ఎప్పుడూ నేను పేదల కోసం కొట్లాడే బిడ్డనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను ఎప్పుడూ పేదల ప్రజల పక్షాన కొట్లాడే బిడ్డనేనని .. సీఎం కేసీఆర్తో అనేక అంశాలపై పెనుగులాడానని గుర్తుచేసుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణ కాలనీలో ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. పదవుల కోసం పెదవులు మూయొద్దని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అనేక అంశాలపై ఆయనతో పెనుగులాడానని.. బయటికి చెప్పకపోయినా, అంతర్గతంగా కొట్లడానని.. నా అభిప్రాయం ఖచ్చితంగా చెప్పానని తెలిపారు.
ఇక, ఎప్పుడూ నేను పేద ప్రజల కోసం కొట్లాడే బిడ్డనేనని.. ఎవరికి ఆపద వచ్చినా కో అంటే కో అనే బిడ్డను నేను అన్నారు ఈటల రాజేందర్.. రాజీనామా చేసిన తర్వాత నన్ను ఓడించడానికి ఎన్నివస్తున్నాయో చూడండి అని ప్రశ్నించిన ఈటల…. ఇంతకు ముందు పెన్షన్, రేషన్ కార్డు రావాలన్న సీఎం ఆఫీస్ కి పోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉప ఎన్నికల పుణ్యమా అని అన్ని ఇప్పుడు ఇస్తున్నారని తెలిపారు.. మరోవైపు.. అధికారాన్ని చేజిక్కించుకొని చెర బట్టిన వ్యక్తి కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్.
Also Read
- Tags
- bjp
- cm kcr
- Etela Rajender
- telangana
- TRS
తాజావార్తలు
-
Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు
-
IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!
-
Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో
-
Sai Pallavi: ‘రామాయణ’ టీమ్పై సాయిపల్లవి ఫ్యాన్స్ ఫైర్!
-
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..