తెలంగాణలో కరోనా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,487 శాంపిల్స్ పరీక్షించగా.. 733 మందికి పాజిటివ్గా తేలింది.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,82,336కు పెరిగింది.. ఇదే సమయంలో 2,850 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య7,62,594కు చేరింది.. మరో వ్యక్తి కోవిడ్తో కన్నుమూయగా.. ఇప్పటి వరకు 4,106…
తెలంగాణలో పాలిటెక్నిక్ ప్రశ్నా పత్రాలు లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. దీంతో.. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన రెండు పాలిటెక్నిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ సాంకేతిక విద్యా మండలి. ఇక, రద్దు చేసిన ఆ రెండు పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి.. ఇదే సమయంలో హైదరాబాద్శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్మండలం బాటసింగారంలోని…
జనగామలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో.. తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతారంటూ ప్రచారం జరిగింది.. దానికి ప్రధాన కారణం రాజ్యసభ వేదికగా మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలే కారణం.. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మాటల దాడికి దిగుతున్నారు.. అయితే, ఇవాళ కేంద్రాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేసినా.. నరేంద్ర మోడీ చేసిన ఆ వ్యాఖ్యల జోలికి మాత్రం…
తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ఎస్ఎస్సీ బోర్డు.. ఆ షెడ్యూల్ ప్రకారం.. మే 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. 20వ తేదీతో పరీక్షలు పూర్తికానున్నాయి.. ఈ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది… ఇక, 11న ఫస్ట్ లాంగ్వేజ్, 12న సెకండ్ లాంగ్వేజ్, 13న థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలు ఉండగా.. 14వ తేదీన మ్యాథ్స్, 16న జనరల్ సైన్స్, 17వ…
ప్రధాని నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమేస్తామంటూ హెచ్చరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.. జనగామలో జరిగిన గొడవపై స్పందిచిన కేసార్.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత?…
ప్రధాని నరేంద్ర మోడీ జాగ్రత్త.. నీ ఉడుత ఊపులకు భయపడం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్… జనగామ బహిరంగసభ వేదికగా.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు కేసీఆర్.. 8 ఏళ్లుగా పైసా ఇవ్వకపోయినా కేంద్రాన్ని ఏమీ అనలేదన్న ఆయన.. అడ్డగోలుగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.. ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో కొత్త పంచాయితీ పెడుతున్నారు.. ప్రతీ మోటారుకు విద్యుత్ మీటరు పెట్టాలంటున్నారని ఫైర్ అయ్యారు.. కానీ,…
జనగామ కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది… కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతికి కొబ్బరికాయ అందించారు పూజారి.. ఆ వెంటనే.. తన పక్కనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి కొబ్బరికాయ ఇచ్చిన కేసీఆర్.. కొట్టాల్సిందిగా సూచించారు.. మొదట నిరాకరించినట్టుగానే కనిపించిన ఆయన.. మీరే కొట్టాలని కోరగా.. మరోసారి సీఎం సూచన చేయడంతో.. వెంటనే టెంకాయను కొట్టేశారు కోమటిరెడ్డి..…
ఉద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్.. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు… అందరి కృషివల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందున్న ఆయన.. గతంలో కరెంట్ సమస్య ఉండేదని.. ఆ సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు.. ఇక, ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దని సూచించారు ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను…