ఉద్యోగులు, టీచర్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. 317 జీఓ కారణంగా ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసి, సీనియర్, జూనియర్ల మధ్య ద్వేష భావాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. 317 జీవో విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం నాటకాలు ఆడుతున్నారని సీతక్క అన్నారు. Read Also: బీజేపీపై హరీశ్రావు చేస్తున్న ప్రకటనలు నిరాధారమైనవి: కృష్ణ సాగర్…
బీజేపీపై తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నిత్యం చేస్తున్న నిరాధారమైన ప్రకటనలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తెలంగాణ బీజేపీ బాధ్యతారాహిత్యమని మంత్రి హరీశ్ ఆరోపణలు చేయడం రాజకీయ దూషణలు నిరాధరమైనవని ఆయన అన్నారు. Read Also:దళితుల ఆలయప్రవేశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: ఎమ్మెల్యే…
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టు వాగుపై కురుమూర్తి స్వామి దేవాలయం వరకు కాజ్ వే బ్రిడ్జి, చెక్ డ్యామ్, బీటీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డితో కలిసి భూమిపూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 70 ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా.. ముఖ్యమంత్రిగా కూడా పదవులు అనుభవించిన వారున్నారు.. వాళ్ళు ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.…
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చాంబర్లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనా కవితతో పాటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎన్నికైనా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇంకా మరో పదిమంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. Read Also: ఇండియా టెన్నిస్ స్టార్ సానియామీర్జా రిటైర్మెంట్ కవితతో పాటు స్థానిక…
కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తోన్న తరుణంలో.. కోవిడ్ టెస్ట్ల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది కేంద్రం.. ఇప్పటికే కోవిడ్ టెస్ట్ల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు వెళ్లాయి.. అయితే, రాష్ట్రంలోని అన్ని ఏఎన్ఎం, పీహెచ్సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి హరీష్రావు.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఆసుపత్రిలో…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్ దగ్గర హల్ చల్ చేశారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి.. ప్రగతి భవన్లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు జేసీ దివాకర్ రెడ్డి.. అయితే, అపాయింట్మెంట్ లేకుండా సీఎంను కలిసేందుకు లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు.. కానీ, సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కాకుంటే మంత్రి కేటీఆర్ను కలుస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు జేసీ దివాకర్రెడ్డి… ఇక, పోలీసులు ఎంత…
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. శశాంక్ గోయల్ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న శశాంక్ గోయల్.. కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. గతంలో శశాంక్ గోయల్ కార్మిక, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలు అందించారు. అంతేకాకుండా…
దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.…
తెలంగాణలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది.. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కోవిడ్ బారినపడ్డారు.. మరోవైపు.. సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు.. ఇలా చాలా మందికి కోవిడ్ సోకింది.. తాజాగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో… మంత్రులు, ఇతర నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. జిల్లాలో పంట నష్టంపై తాజాగా, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు…
షాద్నగర్ రైల్వేస్టేషన్లో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి పండగకు ఊరెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వచ్చేందుకు రైల్వేకోడూరులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కింది. కాచిగూడ వరకు టిక్కెట్ కొనుగోలు చేసింది. అయితే మంగళవారం ఉదయం 5:30 గంటలకు రైలు షాద్నగర్లో ఆగిన సమయంలో ఆమె రైలు దిగింది. అది కాచిగూడ కాదని తెలుసుకుని రైలు ఎక్కే క్రమంలో.. అప్పటికే రైలు కదలడంతో జారి రైలు కింద పడిపోయింది.…