కాలుష్య నివారణకు విరివిగా చెట్లు నాటడమే మార్గం అంటున్నారు ఎంపీలు. తెలంగాణలో ప్రారంభమయిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశరాజధానికి విస్తరించింది. దేశ రాజధానిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు. కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో…
భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు విజయశాంతి.. ముఖ్యంగా అధికార పార్టీ, సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ.. ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంపై, కేంద్ర బడ్జెట్ తర్వాత సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంపై ట్విట్టర్ వేదికగా ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు రాములమ్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుతో ఆయన పక్కా హిందూ వ్యతిరేకి అనే విషయం…
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపే కుట్ర జరుగుతోందని.. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించిన తలసాని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనని…
గడిచిన ఐదేళ్లలో దేశంలో 655 పోలీస్ ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇందులో ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 191 కేసులున్నాయని ఆయన చెప్పారు. జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2022 మధ్య కాలంలో ఈ ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. 117 ఉత్తరప్రదేశ్లో, అసోంలో 50, జార్ఖండ్లో 49, ఒడిశా 36, జమ్ముకాశ్మీర్ 35, మహారాష్ట్ర 26 ఎన్కౌంటర్ ఘటనలు చోటుచేసుకున్నాయని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ లోక్సభలో అడిగిన…
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రధాని మోడీ అక్కసుతో మాట్లాడారు. అనేక ఇబ్బందులు తట్టుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మోడీ అలా మాట్లాడుతుంటే.. కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా వున్నారు. ప్రతీ ఓటు ఇంపార్టెంట్ అనుకునే సమయంలో కూడా కేసీఆర్ పార్లమెంట్ కి పోలేదన్నారు. మోడీ..దేశ ప్రధానిగా కాకుండా అక్కసుతో మాట్లాడారన్నారు. తెలంగాణపై మోడీకి ఉన్న అక్కసు ఈ మాటలతో బయటపడిందన్నారు భట్టి. బిల్లు పాస్ చేసేటప్పుడు..…
తెలంగాణ సీఎం కేసీఆర్ జోకర్లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అనర్ధాలను ప్రధాని మోదీ వివరించే ప్రయత్నం చేస్తే… టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఇబ్బందేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే టీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తోందని నిలదీశారు. రాజ్యాంగంపై విమర్శలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు చేపడుతోందని విమర్శించారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్ చేసిన వాఖ్యలపై బీజేపీ ఆందోళనలు…
శ్రీశైలం జలాశయానికి సంబంధించి తాగునీటి అవసరాలను పక్కనపెట్టి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. తాగు, సాగు నీటి అవపరాలు తీరినప్పుడే జల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచనలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టేశాయి. ఫలితంగా శ్రీశైలం జలాశయం నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. 215 టీఎంసీల సామర్థ్యానికి గాను 35 టీఎంసీల డెడ్స్టోరేజీ స్థాయికి నిల్వలు పడిపోయాయి. Read Also: రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఇకపై…
రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ మండిపడుతోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అటు టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవరావు మాట్లాడుతూ… పార్లమెంట్ ప్రొసీడింగ్స్ను ప్రధాని మోదీ మంట కలిపేలా మాట్లాడారని ఆరోపించారు. పార్లమెంట్ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం సైతం ఉండదని.. పార్లమెంట్లో బిల్లు పాసింగ్ మాత్రమే ఉంటుందన్నారు. సైంటిఫిక్, అన్ సైంటిఫిక్…
★ నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన… శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్★ నేడు, రేపు తిరుమలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన… సాయంత్రం తిరుమల చేరుకోనున్న వెంకయ్యనాయుడు.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి★ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని నేడు విజయవాడ ధర్నా చౌక్లో టీడీపీ నేత బోండా ఉమా దీక్ష.. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్న బోండా ఉమా★ రాష్ట్ర విభజన అంశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై…
తెలంగాణలో ఇంటర్ పరీక్ష తేదీలను ఇప్పటికే విద్యాశాఖ ఖరారు చేసింది. ఇంటర్ పరీక్షలు ఖరారు కావడంతో ఎంసెట్ పరీక్షల నిర్వహాణపై ప్రస్తుతం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. దీనికోసం ఉన్నత విద్యామండలి సెట్ కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదికను బట్టి పరీక్షల నిర్వహణ ఉండే అవకాశం ఉంది. అయితే, జూన్ రెండో వారంలో ఎంసెట్ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. Read: ముంబైవాసులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరి నెలాఖరు నుంచి… జూన్ రెండోవారం…