Polytechnic Paper Leak: పరీక్షలు రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..?
తెలంగాణలో పాలిటెక్నిక్ ప్రశ్నా పత్రాలు లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. దీంతో.. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన రెండు పాలిటెక్నిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ సాంకేతిక విద్యా మండలి. ఇక, రద్దు చేసిన ఆ రెండు పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి.. ఇదే సమయంలో హైదరాబాద్శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్మండలం బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ నుంచి పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీకయినట్లు అధికారులు గుర్తించారు.. ప్రశ్నాపత్రాల లీక్ను గుర్తించిన ఇతర జిల్లాల్లోని ప్రిన్సిపల్స్ బోర్డుకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది.
Read Also: India vs West Indies: టీమిండియా క్లీన్ స్వీప్.. విండీస్పై చరిత్ర సృష్టించిన రోహిత్ సేన..
Also Read
- Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
ఈనెల 8, 9 తేదీల్లో జరిగిన మూడో సెమిస్టర్ అప్లయిడ్ ఇంజినీరింగ్ మేథమేటిక్స్, ఐదో సెమిస్టర్లోఎలక్ట్రికల్ సర్క్యూట్ సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలను కాలేజీ సిబ్బందే.. లీక్ చేసినట్లు సాంకేతిక విద్యామండలి గుర్తించింది.. పరీక్ష ప్రారంభం కాకముంతే ప్రశ్నాపత్రాలు లీక్ చేసి వాట్సాప్ ద్వారా కొందరికి పంపినట్లు సాంకేతిక విద్యామండలి దృష్టికి వచ్చింది.. ఇక, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. పరీక్ష సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, పరిపాలన అధికారి కృష్ణమూర్తి, లెక్చరర్ కృష్ణమోహన్కు ఇందులో ప్రమేయం ఉన్నట్లు అబ్దుల్లాపూర్ మెట్పీఎస్లో సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, పేపర్ లీకేజీపై కళాశాలలోని డిపార్ట్మెంటల్అబ్జర్వర్పై సాంకేతిక విద్యామండలి చర్యలు తీసుకుంది.. మరోవైపు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు.. అనుమతి ఎందుకు రద్దుచేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. మొత్తంగా ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 420తో పాటు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెక్షన్ 8ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!