KCR: ఉద్యోగులకు సీఎం గుడ్న్యూస్.. జీతాలు ఇంకా పెరుగుతాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్.. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు… అందరి కృషివల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందున్న ఆయన.. గతంలో కరెంట్ సమస్య ఉండేదని.. ఆ సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు.. ఇక, ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దని సూచించారు ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపిన ఆయన.. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయంటూ తీపికబురు చెప్పారు.
Read Also: Shashank Goyal: కేంద్రం ఆదేశాలు.. శశాంక్ గోయల్ రిలీవ్
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
భారత దేశవ్యాప్తంగా 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 గ్రామాలు మన రాష్ట్రంలోనివే అని గుర్తుచేశారు సీఎం కేసీఆర్.. పట్టుదలతో, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఇలాంటి సాధ్యమయ్యాయన్న ఆయన.. ఇక, విద్యుత్శాఖ ఉద్యోగులు రాత్రిపగలు కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు.. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వేర్వేరు కాదని స్పష్టం చేశారు.. ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి.. అప్పట్లో జనగామలో మంచినీళ్లు కూడా ఉండని పరిస్థితి ఉండేదన్న ఆయన.. ఎంతోమంది వలసపోయారు… అప్పటి పరిస్థితి చూసి ఎంతో బాధపడ్డాను.. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకున్నాం… అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.. అంతేకాదు. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగింది.. త్వరలో తలసరి ఆదాయం రూ.2.70లక్షలకు చేరబోతుందన్నారు సీఎం.. మరోవైపు.. భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయని.. హైదరాబాద్లో 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారంటూ.. ఏ స్థాయిలో పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఫ్లాట్లు, విల్లాలు, భూములు కొంటున్నారని తెలిపారు.. మరోవైపు.. జోనల్ వ్యవస్థపై ఆయన మాట్లాడుతూ.. జోనల్ వ్యవస్థతో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.. అవగాహన లేక కొందరు వ్యతిరేకించారని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.
తాజావార్తలు
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!