Home
Telangana Politics
Telangana Politics News
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
Telangana Women Commission : తెలంగాణ రాష్ట్రంలో మహిళల హక్కుల పరిరక్షణ, భద్రత , సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర మహిళా కమిషన్కు కొత్త కార్యవర్గాన్ని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకాల్లో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం, సామాజిక సేవ , మహిళా హక్కుల కోసం పోరాడిన… -
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రధానిని కలవడం పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోడీని సాక్షాత్తూ దైవాంశసంభూతుడిగా, మహనీయుల కలబోతగా అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇటీవల తెలంగాణా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన తనికెళ్ల భరణి.. ఆయనతో ఆత్మీయంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ… -
PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
PM Modi: తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, బెంగాల్లో ఎలాంటి ఉత్సాహాన్ని చూశామో, తెలంగాణలో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అంటూ తెలుగులో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారని ఆయన అన్నారు. మమత నియంతృత్వం నుంచి… -
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
CM Revanth Reddy: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. రూ. 9377 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. హెచ్ఐసీసీలో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది అభివృద్ధి ఉత్సవం అని , తెలంగాణ… -
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
ప్రధాని మోడీ ఆదివారం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బీజేపీ సభలో ప్రసంగించనున్నారు. -
CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ను దేశానికే ఒక ఆదర్శవంతమైన నమూనాగా (మోడల్) తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రూ. 110 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై తన విజన్ను పంచుకున్నారు. కొడంగల్ ప్రాంతంలోని లగచర్లను కేవలం ఒక గ్రామంగానే… -
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
Ponnam Prabhakar : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, అయితే అవి హుందాతనాన్ని కోల్పోకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్లే సమాజంలో అశాంతి నెలకొంటోందని, ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు తమ స్థాయిని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. “ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలి. చౌకబారు ప్రచారం… -
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన త్వరలోనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు బోడ జనార్దన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో తెలంగాణ… -
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
KTR : ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక ఆశలు చూపి, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తీరును విమర్శిస్తూ.. ఎన్నికల ముందు “దానవీరశూరకర్ణ”లా గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి, గెలిచిన తర్వాత మాత్రం “కుంభకర్ణుడు”లా నిద్రపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో జేమ్స్ బాండ్ తరహాలో బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ హామీలు ఇచ్చారని కేటీఆర్… -
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
MLA Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాజకీయ చర్యలపై స్పందిస్తూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ ఏర్పాటు విషయాన్ని రాజగోపాల్ రెడ్డి “బిగ్ జోక్”గా అభివర్ణించారు. అదే విధంగా TRS పేరుతో పార్టీ పెట్టడం మరో జోక్ అని వ్యాఖ్యానించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడు బిడ్డగా మాత్రమేనని, ఆమె స్వతంత్ర…
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!