కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరా విషయాన్ని కేంద్రం నుంచి వెంటనే తేవాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు.
తెలంగాణలో కుల గణనను పగడ్బంధీగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుల గణనను పూర్తి చేశామని, వందకు వంద శాతం సరిగ్గా లెక్కలు నమోదయ్యాయని తెలిపారు.
Manda Krishna Madiga: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్దారులను మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలు, ఆసరా పింఛన్ రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు.
పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కూలలేదా?.. కాంగ్రెస్, బీజేపీకి పోలవరాన్ని కూలవరం అనే దమ్ముందా? అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరం విషయంలో ఒక విధానం, పోలవరం విషయంలో మరో విధానమా? అని ప్రశ్నించారు.. పోలవరం కాఫర్ డ్యామ్పై ఎన్డీఎస్ఏ మౌనం ఎందుకు? అని నిలదీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు…
Bandi Sanjay: మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు.
Pilot Rohit Reddy: పార్టీ మార్పుపై ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానని వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తనపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు.
CBI : ఢిల్లీ- తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కిరాతకంగా జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసును సిబిఐకి బదిలీ చేసింది సుప్రీం కోర్ట్.2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణిల హత్య జరిగింది. పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు దంపతులను అడ్డుకొని నడిరోడ్డుపై హత్య చేశారు. అయితే వామనరావు దంపతుల హత్య కేసు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. కోర్టుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తన కొడుకు ,…
Guvvala Balaraju : బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వ్యవహరించిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు నొక్కే విధానాన్ని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలసి నడుస్తున్నాయి. ‘నువ్వు కాకుంటే నేను, నేను కాకుంటే నువ్వు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి” అని బాలరాజు వ్యాఖ్యానించారు. రాహుల్…