Kavita New Party : కవిత కొత్త పార్టీ: తెలంగాణ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా?
- నిజామాబాద్లో కొత్త పార్టీ ప్రకటనకు కవిత సిద్ధం
- ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా రాజకీయాల్లో కొత్త అడుగు
- బోధన్ నుంచి పోటీపై చర్చలు జోరుగా
- మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా కొత్త పార్టీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన నిజామాబాద్ (ఇందూరు) వేదికగానే ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించే అధికారిక సమావేశంలో “తెలంగాణ ప్రజా జాగృతి” పేరుతో కొత్త పార్టీని ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల తేదీని కూడా అదే వేదిక నుంచి వెల్లడించేందుకు సర్వం సిద్ధమైంది.
India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్లు..!
Also Read
- Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
రాబోయే నెలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా, అజెండా , పార్టీ గుర్తును (సింబల్) ప్రజల ముందుకు తీసుకురావాలని కవిత భావిస్తున్నారు. ఈ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం పార్టీ ప్రకటనకే పరిమితం కాకుండా, కవిత రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండటంతో, అదే పార్లమెంట్ పరిధిలోని బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..
కవిత ఈ కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వంటి నేతలు కవిత నిర్ణయంతో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కవిత వెంట ఎంతమంది కీలక నేతలు నడుస్తారు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఆమె పార్టీలో చేరతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే లక్ష్యంతో వస్తున్న ఈ కొత్త పార్టీ, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!