Kavita New Party : కవిత కొత్త పార్టీ: తెలంగాణ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా?
- నిజామాబాద్లో కొత్త పార్టీ ప్రకటనకు కవిత సిద్ధం
- ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా రాజకీయాల్లో కొత్త అడుగు
- బోధన్ నుంచి పోటీపై చర్చలు జోరుగా
- మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా కొత్త పార్టీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన నిజామాబాద్ (ఇందూరు) వేదికగానే ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించే అధికారిక సమావేశంలో “తెలంగాణ ప్రజా జాగృతి” పేరుతో కొత్త పార్టీని ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల తేదీని కూడా అదే వేదిక నుంచి వెల్లడించేందుకు సర్వం సిద్ధమైంది.
India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్లు..!
Also Read
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
- Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
- Off The Record : బడే భాయ్ తో యుద్ధానికి తెలంగాణ సీఎం సిద్ధం..?
రాబోయే నెలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా, అజెండా , పార్టీ గుర్తును (సింబల్) ప్రజల ముందుకు తీసుకురావాలని కవిత భావిస్తున్నారు. ఈ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం పార్టీ ప్రకటనకే పరిమితం కాకుండా, కవిత రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండటంతో, అదే పార్లమెంట్ పరిధిలోని బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..
కవిత ఈ కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వంటి నేతలు కవిత నిర్ణయంతో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కవిత వెంట ఎంతమంది కీలక నేతలు నడుస్తారు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఆమె పార్టీలో చేరతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే లక్ష్యంతో వస్తున్న ఈ కొత్త పార్టీ, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!