Kavitha : కొత్త పార్టీ పేరు అప్పుడే ప్రకటిస్తా.. ఆరోజే బలమైన ముహుర్తం ఉంది..
- రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి కావాలి
- సర్వోదయ తెలంగాణ సాధన కోసమే కొత్త పార్టీ రావాలి
- తెలంగాణ సాధించి పన్నెండేళ్లు దాటింది
- నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించుకోలేకపోయాం
- ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ప్రజలు ఆలోచించాలి
- - కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు దాటినా, అమరవీరుల ఆశయాలైన నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాకారం కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారం కోసం కాకుండా, ‘సర్వోదయ తెలంగాణ’ సాధనే లక్ష్యంగా ఒక కొత్త శక్తి ఉద్భవించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు.
నిజామాబాద్ వేదికగా మాట్లాడిన కవిత, తనకూ ఈ ప్రాంతానికీ ఉన్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “నేను నిజామాబాద్ కోడలిని, తెలంగాణ బిడ్డను. ఈ మట్టికి ఉన్న శక్తి అపారమైనది. నిజామాబాద్ గడ్డ నుంచి తీసుకునే ప్రతి ఆలోచన, చేసే ప్రతి నిర్ణయం ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఆమె విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, గత 20 రోజులుగా మార్క్ఫెడ్ను ఎందుకు తెరవడం లేదని నిలదీశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని, దీనివల్ల సామాన్య రైతు తీవ్రంగా నష్టపోతున్నాడని ఆరోపించారు. ప్రజలు ప్రస్తుతం తాము ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలని, ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 25వ తేదీన ఒక బలమైన ముహూర్తం ఉందని, ఆ రోజున మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో భారీ బహిరంగ సభ ద్వారా తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేస్తూ, ప్రజల పక్షాన నిలబడే ఒక శక్తివంతమైన వేదికగా ఈ పార్టీ రూపుదిద్దుకోబోతోందని ఆమె పేర్కొన్నారు.
Rohit Sharma: “ఓరి దేవుడా.. రోహిత్, గుర్తుపట్టలేకపోయాను”.. హిట్మ్యాన్ను చూసి అందరూ షాక్
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!