తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఖజానా సరిపోతోందని ఆమె ధ్వజమెత్తారు. “పాండవులు సంపాదించింది కౌరవుల తద్దినానికే సరిపోయినట్లు.. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే మాకు సరిపోతోంది” అంటూ ఆమె ఎద్దేవా చేశారు. హరీష్ రావు తన నియోజకవర్గంలోనే రైతులకు…
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కేవలం హామీలకే పరిమితం కాకుండా, వాటికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన అధికారిక నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు అసెంబ్లీ సెక్రెటరీకి కూడా అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తామంటున్న ఆరు గ్యారంటీలకు చట్టపరమైన రక్షణ ఉంటేనే లబ్ధిదారులకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని, ఈ బిల్లు ద్వారా ఆయా పథకాల అమలులో పారదర్శకత ,…
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానం మెట్లెక్కింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. గత సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి…
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా పేరున్న జీవన్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జగిత్యాల నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు జరిపిన రాయబారం విఫలమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జీవన్ రెడ్డిని శాంతింపజేసేందుకు మంత్రులు శ్రీధర్ బాబు , అడ్లూరి లక్ష్మణ్ ఆయన నివాసానికి…
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అజీజ్ నగర్లోని సర్వే నెంబర్ 177/33 పరిధిలో ఉన్న సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫామ్ హౌస్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో కట్టినట్లు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయ్యింది. 2006లో ఈ భూమి రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ,…
తెలంగాణ గడ్డపై కళలకు, కళాకారులకు అత్యున్నత గౌరవం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ను నిర్వహించింది. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ పునఃప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులను…
TPCC Mahesh Goud : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీల (DCC) నియామక ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తొలి విడతగా రాష్ట్రంలోని 14 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయి కార్యవర్గ కమిటీలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటించారు. Mahindra BE 6 Batman Edition:…
Off The Record: తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజార్టీ ఉండడంతో ఆ రెండూ కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. అదే సమయంలో…బీఆర్ఎస్ కూడా కాస్త గట్టిగా ప్రయత్నిస్తే… కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం గెలిచే అవకాశం ఉండేదన్న చర్చ కూడా జరిగింది. కానీ… తమకు పూర్తి స్థాయి బలం లేదని, అనవసరంగా పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకోవడం ఎందుకంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆ ప్రతిపాదనల్ని అంత సీరియస్గా తీసుకోలేదు.…
Off The Record: తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఎవర్ని కదిలించినా ఒకటే టాపిక్. అదే…. కేబినెట్ విస్తరణ గురించి. సీఎం రేవంత్ రెడ్డి, PCC చీఫ్ మహేష్ గౌడ్ ఒకేసారి ఢిల్లీ వెళ్ళడం, అంతకు ముందు రోజే కో ఆర్డినేషన్ కమిటీ ప్రకటన రావడం, అటు పీసీసీ చీఫ్ గా జగ్గారెడ్డి ఉంటే 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామెంట్ చేయడం… ఇలా ఒకదాని వెంట ఒకటిగా వరుస పరిణామాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కలిపి…