Home
Telangana Politics
Telangana Politics News
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
CM Revanth Reddy vs KTR : గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం నెలకొంది. కేటీఆర్పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, “పరువు ఉన్నవాడే పరువు నష్టం దావా వేస్తాడు” అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ సీసీఎస్లో అధికారికంగా ఫిర్యాదు చేస్తేనే గ్లోబరీనా అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తామని, తాను నేరుగా చొరవ తీసుకుంటే కక్షసాధింపు చర్యగా ప్రచారం… -
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
KTR : వరంగల్లో నిర్వహించిన చిట్ చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబరీనా సంస్థ తనదంటూ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి డిఫమేషన్ నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆ నోటీసుకు సరైన సమాధానం ఇవ్వకపోతే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గ్లోబరీనా సంస్థతో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఒకవేళ అది తన సంస్థే అయితే ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆ… -
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
Komatireddy Rajgopal Reddy : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. కొద్దిరోజుల క్రితం మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీటీసీ యాదయ్య కుమారుడికి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జాతీయ పరిణామాలపై తీవ్ర నిరసన బాధితుల పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి,… -
Bhatti Vikramarka : కేటీఆర్కు ‘ఎల్ నినో’పై కనీస అవగాహన లేదు
Bhatti Vikramarka : “కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి, అమెరికాలో చదువుకున్న కేటీఆర్కు ప్రపంచ వాతావరణ మార్పులు, ‘ఎల్ నినో’ ప్రభావంపై కనీస అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ (NPDCL) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు కొండ… -
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం , రచ్చపల్లి గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్కు రైతుల కష్టాలు ఎన్నడూ కనిపించలేదని, ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే పరామర్శల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు… -
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్ నగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేటీఆర్ ‘డెత్ డిక్లరేషన్’ అంటూ మాట్లాడటంపై ఆయన తీవ్ర కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్కు ఏమాత్రం రాజకీయ నియత్ (నిజాయితీ) ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబానిదైతే.. విలువలు లేని రాజకీయాలు కేసీఆర్ కుటుంబానివని మండిపడ్డారు. సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతి… -
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ వద్ద ఉద్రిక్తత, ఆవేశాల మధ్య రైతులు చేపట్టిన పాదయాత్రలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రంగనాయక సాగర్ను నీటితో నింపాలన్న ఒకే ఒక్క ఆకాంక్షతో చిన్నకోడూరు రైతులు స్వచ్ఛందంగా ఈ పాదయాత్ర చేపట్టారని, ఇది బీఆర్ఎస్ పెట్టిన యాత్ర కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఇది కాలం తెచ్చిన కరువు కాదు,… -
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Chief Minister Revanth Reddy: ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని, ఇకపై పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాయకత్వం అంటే హైదరాబాద్లోని ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు, ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయడమన్నారు. పదవుల కోసం పైరవీలు చేసే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వవద్దని కరాఖండిగా చెప్పారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయి బాధ్యతలపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రేపటి నుంచి… -
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
CM Revanth Reddy : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అందెశ్రీ స్మృతివనం నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “గత పాలకులు అహంకారంతో అందెశ్రీ రాసిన పాటను నిర్బంధించాలని చూశారు. నాడు ఏ పాటను అయితే అణచివేయాలని… -
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
Komatireddy Rajgopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మంత్రి పదవి, కుటుంబంలో ఇద్దరికి పదవుల అంశంపై వస్తున్న విమర్శలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. “నేను ఎప్పుడూ పదవులు అడుక్కోను.. నేనొక ఫైటర్ను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక రెవల్యూషన్ (విప్లవం) లాగే ఉంటుంది” అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా…
తాజావార్తలు
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
-
Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!