నిజామాబాద్ మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ స్థాపించినా, పాదయాత్ర చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టే పాదయాత్రను తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ప్రతి రాజకీయ కార్యక్రమాన్ని ఆదరిస్తామన్నారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు అని మహేష్ కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు…
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కుటుంబం చుట్టూ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన, కవిత పేరు ఎత్తకుండానే పరోక్షంగా గట్టి కౌంటర్లు ఇచ్చారు. కొత్త పార్టీల ఆవిర్భావంపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చు కానీ, ప్రజలు ఓట్లు వేయాలి కదా అని కేటీఆర్ ఎద్దేవా…
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఒకరి దోపిడీని మరొకరు బయటపెట్టకుండా పరస్పరం కాపాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంట్రాక్టుల కేటాయింపులో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న “ఇచ్చి-పుచ్చుకునే బంధం” స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో వందల కోట్ల కాంట్రాక్టులు…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతున్న తరుణంలో, ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు జరుగుతాయని ఆశించిన అభ్యర్థులకు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పట్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తాజా సమాచారం అందుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసింది. ఆయా ఎన్నికల్లో పార్టీ ఆశించిన దానికంటే…
తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజ నేతలు.. ఒకరు ఉద్యమ నాయకుడు కేసీఆర్, మరొకరు రైతు పక్షపాతి జీవన్ రెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒక్కటవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు , పార్టీ ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ నివాసంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డిని చూడగానే గులాబీ…
ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని, కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తెస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ధర్నా చేస్తున్న రైతులతో భేటీ అయిన ఆయన, ఈ పోరాటం రాజకీయాల కోసం చేస్తున్నది కాదని, రైతుల భూములను కాపాడుకోవడానికి చేస్తున్న ఆత్మాభిమాన పోరాటమని పేర్కొన్నారు. Summer Tips:…
తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ అక్రమాల వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ మైనింగ్ లూటీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొంగులేటి తన ‘పొగరు’ తగ్గించుకోవాలని హితవు పలికిన హరీష్ రావు, అక్రమ మైనింగ్కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన మైనింగ్ వ్యవహారాలపై మంత్రి పొంగులేటి చేస్తున్న బుకాయింపులను హరీష్ రావు ఎండగట్టారు. “అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్…
OTR: పొలిటికల్ పిడుగులు పడుతున్నా.. పెదవి విప్పరు. ఆరోపణల ఉరుములు ఉరుముతున్నా.. అణు మాత్రం కూడా స్పందించరు. అసలు అనేది నన్ను కాదుకదా… అన్న ధోరణి పెరిగిపోతోంది. తెలంగాణ మంత్రులంతా ఈ ప్రభుత్వం మాది అని ఓన్ చేసుకోవడం లేదా? అందుకే ప్రతిపక్షం అనేది నన్నుకాదుకదా…. నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారా? ప్రతిపక్షానికి కౌంటర్స్ వేయమని మంత్రులకు ముల్లుగర్రలు పెట్టి పొడిచి చెప్పాల్నా? తెలంగాణ కేబినెట్లో అసలేం జరుగుతోంది? సమ్మర్ సెగలతో పాటే తెలంగాణలో…
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా నాదర్గుల్ భూముల వ్యవహారం , మంత్రులపై వస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలను ‘అబద్ధాల రావు’, ‘డ్రామాల రావు’ అని సంబోధిస్తూ, వారు చేస్తున్న విమర్శలను అసత్యాల పుట్టగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని పేర్కొన్న ఆయన, కేరళలో యుడిఎఫ్ (UDF) కూటమి అద్భుతమైన మెజార్టీతో…
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22కి తీర్పును వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై లోతైన విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. Also Read:Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా?…