Home
Telangana Politics
Telangana Politics News
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
తెలంగాణ ఆర్థిక స్థితిగతులు, గత పదేళ్ల పాలనలో జరిగిన అప్పులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రమైంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సృష్టించిన ఆస్తులు , చేసిన అప్పులపై చర్చించేందుకు సిద్ధమా అని… -
Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..
కేసీఆర్ రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. NTVతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం తన తప్పిదాలు బయటకు రాకుండా ఉండేందుకే కేసీఆర్ రాజీనామా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ప్రజలు రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలని కోరుతున్నారని, వారి దృష్టిని మరల్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పిల్ల చేష్టలు చేస్తున్నారని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.… -
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తాం
Harish Rao : ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగడతామని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని ఆరోపించిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం… -
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
ఎర్రవల్లిలోని తన నివాసంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్ష (BRSLP) సమావేశంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న పాలన తీరుపై మండిపడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని, శాసనసభ వేదికగా ప్రతిపక్షాలను ఆహ్వానిస్తున్న తీరును ఎండగట్టారు. నేను అసెంబ్లీకి రావాలా? వద్దా?: ఎమ్మెల్యేలను అడిగిన కేసీఆర్ శాసనసభ సమావేశాల సందర్భంలో అధికార పార్టీ నడుచుకుంటున్న తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు.… -
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
రేపటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం (BRSLP) కీలక సమావేశం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో శనివారం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ముఖ్య నేతలు హాజరయ్యారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరుకావాలి సభకు… -
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని ఆయన ఫాంహౌస్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ లంచ్ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీతో పాటు శాసనమండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్… -
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు మరింత వేడెక్కాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బలమైన కోటలుగా ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో త్వరలోనే మువ్వన్నెల జెండాను ఎగరేయడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల, సిద్దిపేటలపై కాంగ్రెస్ దండయాత్ర సిరిసిల్ల, సిద్దిపేట గడ్డలపై రాబోయే రోజుల్లో విజయం కాంగ్రెస్దేనని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.… -
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
Padi Kaushik Roddy : శాసనసభ ఎథిక్స్ కమిటీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కమిటీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి తన పూర్తి వివరణ సమర్పించడానికి ఆరు వారాల సమయం కావాలని కోరుతూ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. ఆగస్టు 31న తనకు ఎథిక్స్ కమిటీ నోటీసు అందిందని, సెప్టెంబర్ 5 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు కౌశిక్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. కమిటీ తనకు అందించిన మెటీరియల్ వాల్యూమ్… -
KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో సాంకేతిక విద్యకు పెద్దపీట మల్టీ డిసిప్లినరీ కోర్సులు, అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి కేసీఆర్ ప్రభుత్వం… -
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
KTR Slams Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో యువత పాత్ర కీలకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ అంటే కదన, కొదమ సింహాల గడ్డ అని వ్యాఖ్యానించిన ఆయన.. యువతతో పెట్టుకోవద్దని, రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ యువతను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. యువత తలచుకుంటే తమ భవిష్యత్తును తారుమారు చేయగల శక్తి ఉందని అన్నారు. ‘యువతను తక్కువ అంచనా వేయొద్దు’ యువతకు స్కిల్ లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని కేటీఆర్…
తాజావార్తలు
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!