Home
Telangana Politics
Telangana Politics News
-
OTR: మున్సిపల్ యుద్ధం కోసం కాషాయ దళం కత్తులు.. ఈసారి సీరియస్గా ఉన్న కేంద్ర పార్టీ!
OTR: మున్సిపల్ ఎన్నికల్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు అగ్ని పరీక్షగా భావిస్తున్నారా? తేడా పడితే…. రేపు ఢిల్లీలో ముఖం చూపించుకోలేమని ఫీలవుతున్నారా? కేంద్ర నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో ఉండటం ఎంపీల్ని కంగారు పెడుతోందా? ఇప్పుడు చెమటోడ్చకపోతే…. రేపు చిన్న చిన్న పనులు కూడా కావన్న భయం కాషాయ ఎంపీల్లో పెరుగుతోందా? గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న మంత్రాంగం ఏంటి? తెలంగాణ మున్సిపల్ యుద్ధం కోసం అన్ని రకాల అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగుతున్నాయి… -
CM Revanth: మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ‘రైతు భరోసా’.!
CM Revanth: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. Mohan Babu University Kidnap Case: ఆధారాలు దోరికాయి.. మంచు మోహన్ బాబు, విష్ణు లకు నోటీసులు ఇస్తాం! గత… -
Minister Seethakka : మేడారం జాతర దిగ్విజయం.. దొంగ ప్రచారాలకు తావులేదు..
మేడారం మహాజాతర అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగియడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గత జాతరల కంటే మెరుగైన ఏర్పాట్లు చేశామని, అమ్మవార్ల ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని ఆమె కొనియాడారు. ఈ ఏడాది జాతర అంచనాలకు మించి జరిగిందని మంత్రి తెలిపారు. “క్లాస్, మాస్ అనే తేడా లేకుండా హైక్లాస్ పీపుల్ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర కోట్ల మంది… -
Kadiyam Srihari : కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ కార్యాలయం నుండి అధికారికంగా నోటీసులు జారీ అయ్యాయి. Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్ పై నిప్పులు… -
Duddilla Sridhar Babu : కేంద్ర బడ్జెట్పై షాకింగ్ కామెంట్స్.. 42 హామీలు ఏమైనట్టు.?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, పూర్తిగా నిరాశజనకంగా ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా, విభజన చట్టంలోని 42 కీలక అంశాలు నేటికీ పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండటం కేంద్ర… -
KTR : కేసీఆర్ సిట్కు పూర్తిగా సహకరించారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం విచారణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ను వేధించడం అంటే సూర్యుడిపై ఉమ్మివేయడమేనని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ఏ తప్పు చేయలేదు కాబట్టే, భయపడకుండా సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. “నిజానికి కేసీఆర్ గారి వయసు, ఆయన హోదా దృష్ట్యా నివాసం… -
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ విచారణ
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఘట్టం ముగిసింది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం వరకు ఉత్కంఠగా సాగింది. ఏసీపీ స్థాయి అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల సిట్ బృందం ఈ విచారణలో పాల్గొంది. కేవలం ప్రశ్నలు అడగడమే కాకుండా, ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులు ఇచ్చిన… -
KCR : కేసీఆర్ భావోద్వేగం.. రాష్ట్ర సాధన కోసం వ్యూహాలు రచించిన గదిలోనే.. నేడు విచారణ..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నందినగర్ నివాసంలో ఆదివారం సిట్ విచారణ ఉత్కంఠ మధ్య కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా తన నివాసంలోని రెండో అంతస్తులో అధికారుల ప్రశ్నలను ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి, ఎన్నో చారిత్రాత్మక వ్యూహాలను రచించిన అదే గదిలో నేడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన… -
KCR : సిట్కు కేసీఆర్ 6 పేజీల ఘాటు లేఖ.. నోటీసులు అక్రమం.. అయినా విచారణకు వస్తా.!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాసీ సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సుదీర్ఘంగా రాసిన ఆరు పేజీల లేఖలో ఆయన పోలీసుల వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్లోని తన నంది నగర్ నివాసం గోడపై నోటీసును అతికించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల ఇటువంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని… -
Harish Rao: గోదావరి జలాలపై అన్యాయం జరుగుతే ఊరుకోం.!
Harish Rao: తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రం, ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సాధించిన పార్టీగా తమకు రాజకీయాల కంటే ముందుగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పేర్లు మారుతున్నాయే తప్ప, గోదావరి జల ద్రోహం మాత్రం ఆగలేదని హరీష్ రావు అన్నారు. బనకచర్ల నుంచి నల్లమల సాగర్ వరకు పేర్లు మారినా దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. “కత్తి చంద్రబాబు చేతిలో…
తాజావార్తలు
-
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
-
SURIYA : సూర్య 50.. కథ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్?
-
IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
-
Senior Citizen Savings Scheme : సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ. 20,000 వడ్డీ… ఏ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!