Harish Rao : హైదరాబాద్ లో పెద్దఎత్తున మైనింగ్ జరుగుతోంది..
- హైదరాబాద్ శివార్లలో అక్రమ మైనింగ్.. హరీష్ రావు ఆరోపణలు
- ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం..
- స్టోన్ క్రషర్లలో నిబంధనల ఉల్లంఘనలు
- తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర శివారుల్లో, నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ సాగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. శాసనసభలో మైనింగ్ శాఖ డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరును ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. మైనింగ్ శాఖ అనేది రాష్ట్రానికి పన్నేతర ఆదాయాన్ని (Non-Tax Revenue) సమకూర్చే అత్యంత కీలకమైన శాఖ అని, ఇక్కడ ప్రభుత్వం , అధికారులు ఎంత జాగ్రత్తగా ఉంటే రాష్ట్ర ఖజానాకు అంత మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సంచలన ప్రకటన!
Also Read
- Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
- టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
- Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల 'యశ్వన్'.!
- TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ‘కంచే చేను మేసినట్లు’ ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. రక్షకులే భక్షకులుగా మారుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఆరోపించారు. తాను చేసే ప్రతి ఆరోపణకూ ప్రభుత్వ డాక్యుమెంట్లే సాక్ష్యమని, ఏ ఒక్క మాట కూడా గాలిలో మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ మైనింగ్ వ్యాపారాలు దర్జాగా సాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న మనం రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ముఖ్యంగా స్టోన్ క్రషర్ల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను ఆయన ఎత్తి చూపారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025’ (జీఓ నెంబర్ 26) నిబంధనలను తుంగలో తొక్కి, నగర పరిసరాల్లో డీజిల్ జనరేటర్ల సహాయంతో క్రషర్లు నడుపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, దీన్ని ఒక సద్విమర్శగా తీసుకుని ప్రభుత్వం తక్షణమే సరిదిద్దుకోవాలని సూచించారు. తాను సేకరించిన అన్ని డాక్యుమెంట్లను మంత్రికి అందజేస్తానని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్ర ఆదాయాన్ని కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
-
Syria: సిరియా పర్యటనలో మాక్రాన్కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
-
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్లోనే అలా!
-
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
-
IND vs ENG 3rd T20: ‘సర్పంచ్ సాబ్’ సత్తాకు పరీక్ష.. ఆ స్టార్స్ రాణించకుంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!