Harish Rao : హైదరాబాద్ లో పెద్దఎత్తున మైనింగ్ జరుగుతోంది..
- హైదరాబాద్ శివార్లలో అక్రమ మైనింగ్.. హరీష్ రావు ఆరోపణలు
- ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం..
- స్టోన్ క్రషర్లలో నిబంధనల ఉల్లంఘనలు
- తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర శివారుల్లో, నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ సాగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. శాసనసభలో మైనింగ్ శాఖ డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరును ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. మైనింగ్ శాఖ అనేది రాష్ట్రానికి పన్నేతర ఆదాయాన్ని (Non-Tax Revenue) సమకూర్చే అత్యంత కీలకమైన శాఖ అని, ఇక్కడ ప్రభుత్వం , అధికారులు ఎంత జాగ్రత్తగా ఉంటే రాష్ట్ర ఖజానాకు అంత మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సంచలన ప్రకటన!
Also Read
- Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
- TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
- TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆల్టైమ్ రికార్డు..!
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ‘కంచే చేను మేసినట్లు’ ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. రక్షకులే భక్షకులుగా మారుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఆరోపించారు. తాను చేసే ప్రతి ఆరోపణకూ ప్రభుత్వ డాక్యుమెంట్లే సాక్ష్యమని, ఏ ఒక్క మాట కూడా గాలిలో మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ మైనింగ్ వ్యాపారాలు దర్జాగా సాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న మనం రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ముఖ్యంగా స్టోన్ క్రషర్ల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను ఆయన ఎత్తి చూపారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025’ (జీఓ నెంబర్ 26) నిబంధనలను తుంగలో తొక్కి, నగర పరిసరాల్లో డీజిల్ జనరేటర్ల సహాయంతో క్రషర్లు నడుపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, దీన్ని ఒక సద్విమర్శగా తీసుకుని ప్రభుత్వం తక్షణమే సరిదిద్దుకోవాలని సూచించారు. తాను సేకరించిన అన్ని డాక్యుమెంట్లను మంత్రికి అందజేస్తానని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్ర ఆదాయాన్ని కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్లో పాల్గొనేందుకు.. వినేష్ ఫోగాట్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది: బి.వి.ఎస్.రవి
-
Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్తోనే
-
India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!