Harish Rao : హైదరాబాద్ లో పెద్దఎత్తున మైనింగ్ జరుగుతోంది..
- హైదరాబాద్ శివార్లలో అక్రమ మైనింగ్.. హరీష్ రావు ఆరోపణలు
- ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం..
- స్టోన్ క్రషర్లలో నిబంధనల ఉల్లంఘనలు
- తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర శివారుల్లో, నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ సాగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. శాసనసభలో మైనింగ్ శాఖ డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరును ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. మైనింగ్ శాఖ అనేది రాష్ట్రానికి పన్నేతర ఆదాయాన్ని (Non-Tax Revenue) సమకూర్చే అత్యంత కీలకమైన శాఖ అని, ఇక్కడ ప్రభుత్వం , అధికారులు ఎంత జాగ్రత్తగా ఉంటే రాష్ట్ర ఖజానాకు అంత మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సంచలన ప్రకటన!
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ‘కంచే చేను మేసినట్లు’ ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. రక్షకులే భక్షకులుగా మారుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఆరోపించారు. తాను చేసే ప్రతి ఆరోపణకూ ప్రభుత్వ డాక్యుమెంట్లే సాక్ష్యమని, ఏ ఒక్క మాట కూడా గాలిలో మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ మైనింగ్ వ్యాపారాలు దర్జాగా సాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న మనం రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ముఖ్యంగా స్టోన్ క్రషర్ల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను ఆయన ఎత్తి చూపారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025’ (జీఓ నెంబర్ 26) నిబంధనలను తుంగలో తొక్కి, నగర పరిసరాల్లో డీజిల్ జనరేటర్ల సహాయంతో క్రషర్లు నడుపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, దీన్ని ఒక సద్విమర్శగా తీసుకుని ప్రభుత్వం తక్షణమే సరిదిద్దుకోవాలని సూచించారు. తాను సేకరించిన అన్ని డాక్యుమెంట్లను మంత్రికి అందజేస్తానని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్ర ఆదాయాన్ని కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?