Home
Team India
Team India News
-
Team india: మరో మూడు పర్యటనలకు బీసీసీఐ ప్లాన్
ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా మ్యాచ్లు ఆడబోతోంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్తో మ్యాచ్లు ఆడిన భారత్.. గురువారం నుంచి శ్రీలంకతో తలపడనుంది. అనంతరం ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ముగిశాక కూడా టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఉండదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్లను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అర్ధంతరంగా రద్దయిన టెస్టును… -
U-19 Cricket: ఏడుగురు టీమిండియా ఆటగాళ్లకు అవమానం
వెస్టిండీస్ గడ్డపై ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్లో టీమిండియా అదరగొట్టింది. ఫైనల్లో క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే వెస్టిండీస్లో ఏడుగురు అండర్ 19 టీమిండియా ఆటగాళ్లకు అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్పోర్టులో భారత ఆటగాళ్లను అధికారులు అడ్డుకున్నారని.. 18 ఏళ్లు నిండని వారికి భారత్లో వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభించలేదని వివరణ ఇచ్చినా అధికారులు వినిపించుకోలేదని టీమిండియా మేనేజర్… -
Team india: శ్రీలంకతో టీ20 సిరీస్కు మరో కీలక ఆటగాడు దూరం
గురువారం నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్కు ముందే టీమిండియాకు షాక్ తగిలింది. అద్భుత ఫామ్లో ఉన్న కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకతో సిరీస్కు దూరమయ్యాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు జట్టు వర్గాలు చెప్తున్నాయి. దీంతో అతడు శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరంగా ఉంటాడని.. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాయి. కాగా వెస్టిండీస్తో టీ20 సిరీస్ మ్యాన్ ఆఫ్… -
Team India: నేను ఒకరి కెరీర్ నాశనం చేసే టైపు కాదు: సాహా
ప్రస్తుతం టీమిండియాలో వృద్ధిమాన్ సాహా వివాదం హాట్ టాపిక్గా మారింది. శ్రీలంకతో సిరీస్కు సాహాను సెలక్టర్లు పక్కన పెట్టగా… అతడి ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్టు బెదిరించడం రచ్చ రేపుతోంది. దీనిపై బీసీసీఐ రంగంలోకి దిగిందని.. దర్యాప్తు చేపట్టిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదంపై సాహా స్వయంగా స్పందించాడు. ఇప్పటివరకు తనను బీసీసీఐ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ తనను సంప్రదించినా.. బెదిరించిన జర్నలిస్టు పేరును బీసీసీఐకి చెప్పదలుచుకోలేదని వివరించాడు. తాను ఒకరి కెరీర్ నాశనం… -
Virat Kohli: ఇండియాలో అత్యంత పాపులర్ ఆటగాడు ఎవరో తెలుసా?
టీమిండియాకు అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా పక్కకు తప్పుకున్నా విరాట్ కోహ్లీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 2022 జనవరి నెలకు సంబంధించి భారత్లో పాపులర్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మేరకు ఓర్మాక్స్ మీడియా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కోహ్లీ తొలి స్థానంలో ఉండగా.. మాజీ ఆటగాడు ధోనీ రెండో స్థానంలో ఉండటం విశేషం. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక… -
Team India: 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా
టీమిండియా 15 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో చివరి 5 ఓవర్లలో భారత్ అత్యధిక పరుగులు చేసింది. ఆదివారం వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో చివరి 5 ఓవర్లలో టీమిండియా 86 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ చూడముచ్చటైన షాట్లతో అలరించి జట్టుకు భారీ స్కోరు అందించారు. కాగా 2007లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్పై 80 పరుగులు, 2019లో బెంగళూరు వేదికగా… -
Team India: దీపక్ చాహర్కు గాయం.. శ్రీలంకతో సిరీస్కు అనుమానం
కోల్కతా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో కేవలం 1.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అప్పటికే రెండు వికెట్లు కూడా తీశాడు. అతడి రెండో ఓవర్ కోటాను ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ పూర్తి చేశాడు. మళ్లీ దీపక్ చాహర్ బౌలింగ్కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి శ్రీలకంతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్కు దీపక్ చాహర్ అందుబాటులో ఉండడం కష్టమేనని… -
Team India: సాహా వ్యాఖ్యలపై స్పందించిన కోచ్ రాహుల్ ద్రవిడ్
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను రిటైర్ కావాలని సూచించాడంటూ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే సాహా వ్యాఖ్యలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. సాహా తనపై చేసిన ఆరోపణలు తనను బాధించలేదని తెలిపాడు. టీమిండియా సాధించిన ఎన్నో విజయాలకు కారణమైన సాహాపై తనకు గౌరవం కూడా ఉందన్నాడు. జట్టు ఎంపికలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ కఠినంగా ఉంటామని.. ఆటగాళ్లను తుది జట్టులో ఎందుకు ఎంపిక చేయడం లేదో కారణాన్ని… -
ICC T20 Rankings: అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా
వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన మూడు టీ20 సిరీస్ను టీమిండియా వైట్ వాష్ చేసింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకుల్లోనూ టీమిండియా అదరగొట్టింది. ఈ సిరీస్ విజయంతో 269 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ను వెనక్కి నెట్టి టీమిండియా అగ్రస్థానానికి చేరింది. దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరడం విశేషం. అంతకుముందు 2016 ఫిబ్రవరిలో చివరిసారిగా ధోనీ సారథ్యంలో భారత్ అగ్రస్థానానికి చేరింది. మరోవైపు స్వదేశంలో భారత్కు ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం.… -
IND vs WI: టీ20 సిరీస్ కూడా ఊడ్చేశారు
కోల్కతా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు సూర్యకుమార్ యాదవ్ (65), వెంకటేష్ అయ్యర్ (35 నాటౌట్) మంచి స్కోరు అందించారు. దీంతో 20 ఓవర్లలో భారత్ 184/5 స్కోరు చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ను 20 ఓవర్లలో 167/9 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసి భారత…
తాజావార్తలు
-
Harish Rao: ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతోంది.. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
-
Shobha Karandlaje: ఏప్రిల్ 17 భారత మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?
-
IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..
-
Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!