అంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆ జట్టు ఫైనల్కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. కూలీస్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ , కెప్టెన్ యష్ ధుల్, షేక్ రషీద్ అద్భుతమైన భాగస్వామ్యంతో 290 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 194 పరుగులకు పూర్తి 50 ఓవర్లు ఆడకుండానే పెవిలియన్ చేరింది.
అండర్-19 ప్రపంచకప్లో అత్యధిక సార్లు ఫైనల్స్కు చేరిన టీంగా భారత్ జట్టు రికార్డు సృష్టించింది. 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 తర్వాత ఈ ఏడాది కూడా టీమ్ఇండియా ఫైనల్ టిక్కెట్ దక్కించుకుంది. అదే సమయంలో ఇప్పటివరకు నాలుగు సార్లు టైటిల్ కూడా గెలుచుకోగలిగింది. 2000, 2008, 2012, 2018లో భారత్ ప్రపంచకప్ గెలిచింది. ఈసారి ఫైనల్లో ఇంగ్లండ్ ను టీమిండియా ఢీ కొట్టనుంది.