విండీస్తో సిరీస్కు ముందు షాక్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. పలువురు టీమిండియా క్రికెటర్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. బాధితుల్లో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారని తెలుస్తోంది. క్రికెటర్లతో పాటు టీమిండియా సపోర్ట్ స్టాఫ్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని జాతీయ మీడియా పేర్కొంది.
Read Also: ఆ ఒక్క పరుగు తీయనందుకు.. న్యూజిలాండ్ ఆటగాడికి ఐసీసీ అవార్డు
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
- 2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
కాగా ఈనెల 6 నుంచి వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా 8 మంది కరోనా బారిన పడటంతో భారత్-వెస్టిండీస్ మధ్య జరగాల్సిన సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజా పరిస్థితిని పరిశీలిస్తోంది. గురువారం ట్రైనింగ్కు వెళ్లే ముందు జట్టు సభ్యులకు మరోసారి కరోనా టెస్టులు చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ పరిస్థితి ఆందోళనకరంగా మారితే.. సిరీస్ జరిగేది స్వదేశంలోనే కాబట్టి వేరే ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..