టీమిండియా క్రికెటర్లకు షాక్.. ఈసారి ప్రత్యేక విమానాల్లేవ్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో ఇండియాలో వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లను వెస్టిండీస్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్, కోల్కతాలలోనే జరగనున్నాయి. అయితే ఈసారి టీమిండియా క్రికెటర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విమాన కంపెనీల నుంచి స్పందన రాకపోవడంతో ఈసారి క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని బీసీసీఐ చెప్తోంది.
Read Also: ఐపీఎల్-15కు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం?
Also Read
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- Shahrukh Khan: చరిత్ర సృష్టించిన 'షారుఖ్' నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
స్వదేశంలో వెస్టిండీస్తో టీమిండియా అహ్మదాబాద్ వేదికగా మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ చేరుకోవాలని బీసీసీఐ ఆదేశించింది. వన్డే జట్టుకు ఎంపికైన క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం లేదని, ఎవరికివారుగా సాధారణ విమానాలలో అహ్మదాబాద్కు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీ20 సిరీస్ ఆడేందుకు ప్రత్యేకంగా ఛార్టెడ్ విమానంలో క్రికెటర్లను కోల్కతాకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల నుంచి ఛార్టెడ్ విమానంలో ఆటగాళ్లను తీసుకువచ్చి ముంబైలో 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచారు. ఈ ఏడాది అలాంటి ఏర్పాట్లు చేయడం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!