దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైన టీమిండియా టెస్ట్ ఆటగాళ్లు పుజారా, రహానెలు జట్టులో స్థానానికే ఎసరు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో డిమోషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు గ్రేడ్-ఏలో ఉన్న పుజారా, రహానెలను గ్రేడ్-బి కాంట్రాక్ట్కు బీసీసీఐ డిమోషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగనుంది. ఈ క్రమంలో 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు కాంట్రాక్టులను బీసీసీఐ సిద్ధం చేస్తోంది. త్వరలోనే…
దక్షిణాఫ్రికా గడ్డపై వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియా.. త్వరలో సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్.. ప్రస్తుతం పూర్తి కోలుకుని ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. రోహిత్ బుధవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్…
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు. Read Also: టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా.. ఎందుకంటే? ఈ విషయం…
ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియాకు ఐసీసీ భారీ షాకిచ్చింది. కేప్టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆరోపిస్తూ ఐసీసీ భారీగా ఫైన్ విధించింది. రాహుల్ సేన నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియాకు ఐసీసీ 40 శాతం జరిమానా విధించింది. దీంతో భారత ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడనుంది. ఐసీసీ నియామవాళిలోని…
గత నాలుగేళ్లుగా టీమిండియా మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ పరిమిత ఓవర్ల జట్టులో తక్షణమే మార్పులు చేయాలని భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. 2023 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని తాము ఆడుతున్నామని… దానికి అనుగుణంగా మెరుగైన జట్టును సిద్ధం చేసుకోవాలన్నాడు. భారత జట్టుకు కెప్టెన్సీ వహించాలన్నది తన కల అని.. అది సాకారమైందని కేఎల్ రాహుల్ అన్నాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమికి ఏదో సాకు చెప్పాలని తాను అనుకోవడం లేదని.. అయితే ఆ ఓటముల…
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి సత్తా చాటింది. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనతో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా స్మృతి మంధాన నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ స్వయంగా వెల్లడించింది. ఈ అవార్డు రేసులో ఇంగ్లండ్ ప్లేయర్ టామీ బీమాంట్, దక్షిణాఫ్రికా ప్లేయర్ లిజెల్లె లీ, ఐర్లాండ్ క్రికెటర్ గాబీ లూయీస్ నిలిచినా.. స్మృతి మంధాన వారిని వెనక్కి నెట్టి తాను విజేతగా ఎంపికైంది. Read Also:…
దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్లో వన్డేలు, టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. అయితే భారత్లో కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్లు జరిగే వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది. సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నెట్ ప్రాక్టీసులో రోహిత్కు తొడ కండరాల గాయమైంది. దీంతో అతను…
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టుకు షాకుల మీద షాకులు తగిలాయి. టెస్టు సిరీస్తో పాటు వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా… ఆదివారం జరిగే నామమాత్రపు మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రెండు వన్డేల్లో విఫలమైన ఆటగాళ్ల స్థానంలో వేరేవాళ్లకు చోటు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారత జట్టు ఓటమిలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్పై వేటు వేసి.. అతడి స్థానంలో…
టీమిండియాకు చెందిన మరో క్రికెటర్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. టీమిండియా ఆల్రౌండర్, స్పిన్నర్ అక్షర్ పటేల్కు తన గర్ల్ ఫ్రెండ్ మేహతో గురువారం ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం 28వ జన్మదినం జరుపుకున్న అక్షర్ పటేల్ దానిని మరింత మధురంగా మార్చుకున్నాడు. తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అక్షర్ పటేల్ అభిమానులతో పంచుకున్నాడు. అక్షర్ పటేల్ నిశ్చితార్థం విషయాన్ని తొలుత అతడి స్నేహితుడు చింతన్ గాజా సోషల్ మీడియా ద్వారా…
దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు రెండో వన్డే జరగనుంది. పార్ల్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్.. రెండో వన్డేలో అయినా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించినా మిగతా వారు ఘోరంగా విఫలం కావడంతో టీమిండియా ఓటమి పాలు కాక తప్పలేదు.…