Hardik Pandya: నన్ను తీసెయ్యలేదు.నేనే తప్పుకున్నాను..పాండ్యా హాట్ కామెంట్స్..
అప్పటివరకు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ వేసే సరైన అల్ రౌండర్ లేడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత అంతటి మేటి ఆటగాడు జట్టుకు కరువయ్యారు. అయితే అది 2015 IPL టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఒక బక్క పలచని కుర్రాడు ఆ సీజన్ లో అదరగొట్టేశాడు. అటు బౌలింగ్ లో ఇటు ధనాధన్ బ్యాటింగ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జట్టుకు కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఏడాది తిరిగే లోపే టీమిండియా లో చోటు కూడా దక్కించుకున్నాడు.
అతడెవరో కాదు అతడే భారత స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ధనాధన్ బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్, అక్కరకు వచ్చే బౌలింగ్ అతడిని టీమిండియాలో పాతుకుపోయేలా చేశాయి. ఇక 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ అతడిలోని ఫినిషర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే ఆసియా కప్ లో బౌలింగ్ చేస్తూ వెన్నెముక గాయం బారిన పడ్డాడు హార్దిక్. అక్కడి నుంచి అతడి ఆట గాడి తప్పింది. ఫిట్ నెస్ సమస్యలు పేలవ ఫామ్ తో గతేడాది జరగిన T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు.
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
అయితే తాజాగా జరిగిన IPL లో గుజరాత్ టైటాన్స్ ద్వారా మళ్లీ క్రికెట్ లో పునరాగమనం చేసిన హార్దిక్.. మునుపటిలా చెలరేగిపోయాడు. ఫలితంగా మళ్లీ టీమిండియాలో చోటు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ తనపై ఉన్న అపోహలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ” అందరూ అనుకున్నట్లు నాపై BCCI సెలెక్టర్లు వేటు వేయలేదు. T20 ప్రపంచకప్ తర్వాత నేను టీమిండియా సెలెక్షన్ కు అందుబాటులో ఉండనిని వారికి చెప్పాను దాంతో వారు నన్ను టీమిండియాకు తీసుకోలేదు ” అని హార్దిక్ పేర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్ కు ఏ విధంగా అయితే కష్టపడ్డానో టీమిండియా కోసం అందుకు రెండింతలు ఎక్కువగా కష్టపడతానని పాండ్యా తెలిపాడు. అయితే ప్రస్తుతం దొరికిన విశ్రాంతి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు మ్యాచ్ ల T20 సిరీస్ ఆరంభం కానుంది. తొలి T20 ఢిల్లీ వేదికగా జరగనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే అక్కడకు చేరుకోగా.. టీమిండియా సభ్యులు 5వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!