Hardik Pandya: నన్ను తీసెయ్యలేదు.నేనే తప్పుకున్నాను..పాండ్యా హాట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పటివరకు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ వేసే సరైన అల్ రౌండర్ లేడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత అంతటి మేటి ఆటగాడు జట్టుకు కరువయ్యారు. అయితే అది 2015 IPL టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఒక బక్క పలచని కుర్రాడు ఆ సీజన్ లో అదరగొట్టేశాడు. అటు బౌలింగ్ లో ఇటు ధనాధన్ బ్యాటింగ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జట్టుకు కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఏడాది తిరిగే లోపే టీమిండియా లో చోటు కూడా దక్కించుకున్నాడు.
అతడెవరో కాదు అతడే భారత స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ధనాధన్ బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్, అక్కరకు వచ్చే బౌలింగ్ అతడిని టీమిండియాలో పాతుకుపోయేలా చేశాయి. ఇక 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ అతడిలోని ఫినిషర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే ఆసియా కప్ లో బౌలింగ్ చేస్తూ వెన్నెముక గాయం బారిన పడ్డాడు హార్దిక్. అక్కడి నుంచి అతడి ఆట గాడి తప్పింది. ఫిట్ నెస్ సమస్యలు పేలవ ఫామ్ తో గతేడాది జరగిన T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
అయితే తాజాగా జరిగిన IPL లో గుజరాత్ టైటాన్స్ ద్వారా మళ్లీ క్రికెట్ లో పునరాగమనం చేసిన హార్దిక్.. మునుపటిలా చెలరేగిపోయాడు. ఫలితంగా మళ్లీ టీమిండియాలో చోటు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ తనపై ఉన్న అపోహలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ” అందరూ అనుకున్నట్లు నాపై BCCI సెలెక్టర్లు వేటు వేయలేదు. T20 ప్రపంచకప్ తర్వాత నేను టీమిండియా సెలెక్షన్ కు అందుబాటులో ఉండనిని వారికి చెప్పాను దాంతో వారు నన్ను టీమిండియాకు తీసుకోలేదు ” అని హార్దిక్ పేర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్ కు ఏ విధంగా అయితే కష్టపడ్డానో టీమిండియా కోసం అందుకు రెండింతలు ఎక్కువగా కష్టపడతానని పాండ్యా తెలిపాడు. అయితే ప్రస్తుతం దొరికిన విశ్రాంతి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు మ్యాచ్ ల T20 సిరీస్ ఆరంభం కానుంది. తొలి T20 ఢిల్లీ వేదికగా జరగనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే అక్కడకు చేరుకోగా.. టీమిండియా సభ్యులు 5వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!