Hardik Pandya: నన్ను తీసెయ్యలేదు.నేనే తప్పుకున్నాను..పాండ్యా హాట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పటివరకు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ వేసే సరైన అల్ రౌండర్ లేడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత అంతటి మేటి ఆటగాడు జట్టుకు కరువయ్యారు. అయితే అది 2015 IPL టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఒక బక్క పలచని కుర్రాడు ఆ సీజన్ లో అదరగొట్టేశాడు. అటు బౌలింగ్ లో ఇటు ధనాధన్ బ్యాటింగ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జట్టుకు కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఏడాది తిరిగే లోపే టీమిండియా లో చోటు కూడా దక్కించుకున్నాడు.
అతడెవరో కాదు అతడే భారత స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ధనాధన్ బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్, అక్కరకు వచ్చే బౌలింగ్ అతడిని టీమిండియాలో పాతుకుపోయేలా చేశాయి. ఇక 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ అతడిలోని ఫినిషర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే ఆసియా కప్ లో బౌలింగ్ చేస్తూ వెన్నెముక గాయం బారిన పడ్డాడు హార్దిక్. అక్కడి నుంచి అతడి ఆట గాడి తప్పింది. ఫిట్ నెస్ సమస్యలు పేలవ ఫామ్ తో గతేడాది జరగిన T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు.
Also Read
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
అయితే తాజాగా జరిగిన IPL లో గుజరాత్ టైటాన్స్ ద్వారా మళ్లీ క్రికెట్ లో పునరాగమనం చేసిన హార్దిక్.. మునుపటిలా చెలరేగిపోయాడు. ఫలితంగా మళ్లీ టీమిండియాలో చోటు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ తనపై ఉన్న అపోహలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ” అందరూ అనుకున్నట్లు నాపై BCCI సెలెక్టర్లు వేటు వేయలేదు. T20 ప్రపంచకప్ తర్వాత నేను టీమిండియా సెలెక్షన్ కు అందుబాటులో ఉండనిని వారికి చెప్పాను దాంతో వారు నన్ను టీమిండియాకు తీసుకోలేదు ” అని హార్దిక్ పేర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్ కు ఏ విధంగా అయితే కష్టపడ్డానో టీమిండియా కోసం అందుకు రెండింతలు ఎక్కువగా కష్టపడతానని పాండ్యా తెలిపాడు. అయితే ప్రస్తుతం దొరికిన విశ్రాంతి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు మ్యాచ్ ల T20 సిరీస్ ఆరంభం కానుంది. తొలి T20 ఢిల్లీ వేదికగా జరగనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే అక్కడకు చేరుకోగా.. టీమిండియా సభ్యులు 5వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు.
తాజావార్తలు
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..