Team India: విహారి అలా ఆడితే సరిపోదంటున్న అజారుద్దీన్
త్వరలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. గత ఏడాది అర్ధంతరంగా ముగిసిన ఐదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు ఐదో టెస్టు ఆడనున్నాయి. అయితే గతంలో ఫామ్ కోల్పోయిన పుజారా ఏకంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అతడు తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో దేశవాళీ మ్యాచ్లు ఆడుతూ ఫామ్ అందుకున్నాడు. వెస్టిండీస్తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో పుజారా స్థానంలో విహారి మంచి ప్రదర్శన చేశాడు. దీంతో తుది జట్టులో స్థానం కోసం పుజారా, హనుమా విహారి మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో హనుమా విహారిపై మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనుమా విహారి ఓ అసాధారణ ఆటగాడు అని… టీమిండియా తరుపున సుదీర్ఘ కాలం ఆడగల సత్తా ఉన్న ఆటగాడు అని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. అయితే జట్టులో స్థిరమైన చోటు దక్కించుకోవాలంటే అతడు 30, 40 పరుగులు చేస్తే సరిపోదని.. భారీ ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంటుందని హితవు పలికాడు. ఈ విషయం హనుమ విహారి ఇప్పటికే గ్రహించి ఉంటాడని భావిస్తున్నట్లు అజారుద్దీన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 2022 సీజన్లో ఆజింక్యా రహానె గాయపడడంతో ఇంగ్లండ్తో జరిగే ఐదో టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో హనుమ విహారికి చోటు దక్కింది. జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ జరగనుంది.
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
- Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
మరోవైపు ఐదు టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా భారత్ చేరుకుంది. ఈనెల 9న ఢిల్లీలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. త్వరలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఉండటంతో టీమిండియా ఈ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో భారత్ ఎలా ఆడుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో