ఆగస్టులో శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. అయితే ఇదే సమయంలో జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా పర్యటించాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు పర్యటనలు ఉండటంతో ఆసియా కప్కు రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టును, జింబాబ్వేకు జూనియర్ల జట్టును పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆసియా కప్లో పాల్గొనే టీమ్కు రాహుల్ ద్రవిడ్ కోచ్గా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లే బీ టీమ్కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించనున్నారు.…
గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల కోసం ఈ సిరీస్ను ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్కు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు కోలుకుని రెండు రోజుల కిందటే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో టీ20 సిరీస్లో అతడు బరిలోకి దిగడం ఖాయమైంది. రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండటంతో రోహిత్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు.…
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సమకాలీన ఆటగాళ్లలో కోహ్లీ, స్మిత్, రూట్, విలియమ్సన్ ఫార్మాట్తో సంబంధం లేకుండా అత్యుత్తమ ఆటగాళ్లుగా చలామణి అవుతున్నారు. కానీ వీరిలో విరాట్ కోహ్లీ మాత్రం గత మూడేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. పరుగుల యంత్రం కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నా సెంచరీ చేసి మూడేళ్లు దాటిపోతోంది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆటగాడిగా…
ఇంగ్లండ్తో గెలవాల్సిన టెస్టులో ఓటమి చెందిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. బర్మింగ్ హామ్లో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. అంతేకాకుండా రెండు పాయింట్లు కూడా కోసేశారు. దీంతో డబ్ల్యూటీసీ టేబుల్లో ఇన్నాళ్లూ మూడో స్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. అటు పాకిస్థాన్ మూడో స్థానానికి…
టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారిగా 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఇంగ్లీష్ జట్టు మరో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే కొట్టేసింది. అలాగే తొలి ఇన్నింగ్స్లో 100కు పైగా పరుగుల ఆధిక్యాన్ని పొంది టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో బుమ్రా…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో టీమిండియా చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. ముఖ్యంగా నాలుగో రోజు బౌలింగ్ వైఫల్యం జట్టు కొంప ముంచింది. దీంతో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను టీమిండియా బౌలర్లు ఏ విధంగానూ ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలీ (46) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి నాంది…
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకున్నాడు. ఇటీవల అతడికి చేసిన కరోనా నిర్ధారణ పరీక్షణ నెగిటివ్ రావడంతో రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ కఠోర సాధన చేస్తున్నాడు. భారీ షాట్లతో పాటు డిఫెన్సివ్ షాట్లు ఆడుతూ రోహిత్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దీంతో అతడు త్వరలో ఇంగ్లండ్తో జరిగే వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉండటం…
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రెండు రోజులు టీమిండియానే హవా చూపించింది. దీనికి కారణం ముగ్గురు మోనగాళ్లు. వాళ్లే రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా. పంత్, జడేజా సెంచరీలతో చెలరేగితే.. వరుణుడు అంతరాయం కలిగించినా బుమ్రా పట్టుదలతో బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను కష్టాల్లో పడేశాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టడంతో జస్ప్రీత్ బుమ్రా మరో ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021-23లో ఇప్పటివరకు అత్యధిక…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియాకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నా మనోళ్లు సత్తా చాటుతున్నారు. తొలిరోజు రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగగా.. రెండో రోజు బుమ్రా ఇంగ్లండ్కు తన దెబ్బ రూచి చూపించాడు. బ్యాటింగ్లో ఒకే ఓవర్లో 35 పరుగులు పిండుకున్న బుమ్రా.. బౌలింగ్లోనూ రాణించాడు. కెప్టెన్గా ఎలాంటి ఒత్తిడిని అతడు ఎదుర్కొన్నట్లు కనిపించలేదు. బుమ్రా విజృంభించడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు…