TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
- రోడ్డుపై పడినవి 2018 నాటి OMR షీట్లేనని స్పష్టీకరణ
- ఇద్దరు సెక్షన్ ఆఫీసర్ల సస్పెన్షన్
- కాంట్రాక్టర్పై FIR, వర్క్ ఆర్డర్ రద్దు
- భవిష్యత్ పరీక్షలపై ప్రభావం లేదన్న TGPSC
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ రోడ్డుపై ఓఎంఆర్ (OMR) జవాబు పత్రాలు కనిపించిన వ్యవహారం తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) స్పందించింది. ఈ ఘటనపై స్పష్టతనిస్తూ అధికారిక వివరణ విడుదల చేసింది. బాధ్యులైన ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను తక్షణమే సస్పెన్షన్ చేయడంతో పాటు ఓఎంఆర్ షీట్ల తరలింపులో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ను రద్దు చేసి, అతనిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు కమిషన్ వెల్లడించింది.
2018 నాటి పాత ఓఎంఆర్ షీట్లే
రోడ్డుపై ప్రత్యక్షమైన ఓఎంఆర్ షీట్లు 2018లో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నియామక పరీక్షకు సంబంధించినవని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలను ఇప్పటికే 2020లోనే విజయవంతంగా ప్రకటించామని తెలిపింది. కమిషన్ రికార్డుల నిర్వహణ నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితి పూర్తయినందున, వీటిని ధ్వంసం (Shredding) చేయడానికి గుర్తించినట్లు వెల్లడించింది. అయితే ఆ రికార్డుల ధ్వంస ప్రక్రియ కోసం అధీకృత కాంట్రాక్టర్కు అప్పగించిన సమయంలో ఊహించని విధంగా కొన్ని ఓఎంఆర్ షీట్లు రోడ్డుపై పడిపోయినట్లు పేర్కొంది.
Also Read
అధికారులపై వేటు, కాంట్రాక్టర్పై క్రిమినల్ కేస్
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అంతర్గత విచారణ ముమ్మరంగా కొనసాగుతోందని కమిషన్ తెలిపింది. విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, తీవ్ర పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్ చేసినట్లు కమిషన్ వెల్లడించింది. మరోవైపు ఓఎంఆర్ షీట్ల సురక్షిత తరలింపు , నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకున్నారు. అతనికి ఇచ్చిన వర్క్ ఆర్డర్ను వెంటనే రద్దు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
భవిష్యత్ పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదు
గతంలో పూర్తయిన పరీక్షల పాత రికార్డులు మాత్రమే కావడం వల్ల ఈ ఘటనతో రాబోయే లేదా ప్రస్తుతం జరుగుతున్న ఎలాంటి భవిష్యత్ నియామక ప్రక్రియలపై ప్రభావం ఉండదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కమిషన్ పరిధిలోని రికార్డుల నిర్వహణ, వాటిని భద్రపరచడం ప్రక్రియల్లో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!