India : నెక్ట్స్ కెప్టెన్ అతడే..?: సునీల్ గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ దిశగా టీమిండియా ముందుకు సాగుతుంది. 20 మంది ప్లేయర్లతో కూడిన ఓ ప్రత్యేకమైన కోర్ గ్రూప్ ను ఏర్పాటు చేసి వారితోనే మ్యాచ్ లను ఆడిస్తుంది. వరల్డ్ కప్ వరకూ టీమిండియాకు సారథిగా రోహిత్ శర్మనే ఉంటాడు. కానీ ఆ తర్వాత అతడు కొనసాగడం అనేది అనుమానమే. వయసు భారం, జట్టులోకి యువ ఆటగాళ్లు దూసుకొస్తుండటంతో ఇప్పటికే టీ20లలో సీనియర్లను పక్కనబెట్టిన టీమ్ మేనేజ్మెంట్.. వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ తో కూడా మాట్లాడనుందని వార్తులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్యూచర్ కెప్టెన్ ఎవరు..? అన్న రచ్చ కూడా జోరుగా సాగుతుంది. తాగాజా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరు..? అన్న చర్చే వస్తే తాను మాత్రం హార్థిక్ పాండ్యాకే ఓటేస్తానన్నాడు.
Also Read : Ozone Hole: ఆస్ట్రేలియా కార్చిచ్చు కారణంగా పెరిగిన ఓజోన్ హోల్..
Also Read
- Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
- Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
- Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
- Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. 'స్క్విడ్ గేమ్' స్టార్ మరో అరుదైన ఘనత
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసింది.. ఈ నెల 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన టీవీ కార్యక్రమంలో గవాస్కర్ ఈ కామెంట్స్ చేశారు. కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా తన టీమ్ మెంబర్స్ తో చాలా కంఫర్ట్ గా ఉంటాడు అని తెలిపారు. అతడు ఆటగాళ్లను హ్యాండిల్ చేసే విధానం బాగుంటుంది.. ప్రతీ ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్ల భుజానికి భుజం కలిపి మాట్లాడే విధానంతో వారికి ఎంతో ఓదార్పునిస్తుందని సునీల్ గవాస్కర్ అన్నారు. వాస్తవానికి మిడిలార్డర్ లో హార్దిక్ పాండ్యా చాలా ప్రభావం చూపగల ఆటగాడు.. అతడు ఒక గేమ్ ఛేంజర్.. తాను సారథిగా ఉన్న ఐపీఎల్ లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడుతూ అతడు బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చి ఆడాడు.. ఇది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని గవాస్కర్ తెలిపారు.
Also Read : Goyaz Silver Jewellers: యాంకర్ సుమ చేతులమీదుగా గోయాజ్ జ్యూయలరీ ప్రారంభం
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నన్ను చాలా ఆకట్టుకున్నదని.. ముంబైలో ఆసీస్ తో జరుగబోయే మ్యాచ్ లో గనక గెలిస్తే ప్రపంచకప్ తర్వాత హార్థికే భారత జట్టు సారథిగా ఉంటాడని తాను నమ్ముతున్నా.. అని చెప్పాడు. కాగా ఆస్ట్రేలియాతో మార్చి 17న మొదలయ్యే తొలి వన్డేలో హార్థిక్ పాండ్యా సారథిగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్.. తొలి వన్డేకు దూరంగా ఉండనున్నాడు.. తర్వాత రెండు వన్డేలకు జట్టుతో కలుస్తాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు టీ20లలో సారథిగా వ్యవహరించిన పాండ్యా.. ఈ ఏడాది జనవరి నుంచి స్వదేశంలో దాదాపుగా పూర్తి స్థాయి సారథిగా ఎంపికయ్యాడు. ఇటీవల చేతన్ శర్మ స్టింగ్ ఆపరేసన్ వీడియోలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ లలో అతడే కెప్టెన్ గా వ్యవహారించాడు. వన్డేలలో హార్థిక్ భారత్ కు సారథిగా వ్యవహరించడం ఇదే తొలిసారి..
తాజావార్తలు
-
PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!
-
Lectrix NDuro: 120KM రేంజ్తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!