IPL 2023 : ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు రోహిత్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ సీజన్ కు.. ఇప్పటికే రంగం సిద్దమైంది. ఇక ఇవాళ్టి నుంచి ప్రాక్టీస్ సెషన్ లు కూడా ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ లో ఆడాల్సి ఉన్న పలువురు స్టార్ క్రికెటర్లు గాయాలతో టోర్నమెంట్ కు దూరరమయ్యారు. టీమ్ ఇండియాలోని పలువురు ప్లేయర్లు కూడా గాయాల కారణంగా ఐపీఎల్ సీజన్ కు దూరంకానున్నారు. గాయం అంత తీవ్రతరమైనది కాకుంటే ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడించాలనే ప్రయత్నాల్లో జట్టు యాజమాన్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కో ఆటగాడిపై భారీగా ఖర్చు చేశాయి. ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్ లో భారత్ పలు కీలక టోర్నమెంట్ లు ఆడాల్సి ఉంది. గాయాలపాలైన ఆటగాళ్లను ఐపీఎల్ ఆగిస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉంది. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
Also Read
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
రెండు నెలల పాటు జరగనున్న ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత జూన్ లో టీమ్ ఇండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ జరుగునుంది. దీంతో ఆటగాళ్ల ఫిట్ నెస్ చాలా ముఖ్యమని రోహిత్ శర్మ తెలిపాడు. భవిష్యత్ లో టీమ్ ఇండియా పలు ఐసీసీ టోర్నీల్లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ తో ఆటగాళ్ల ఫిట్ నెస్ కోల్పోతారు కదా అన్న ప్రశ్నకు రోహిత్ శర్మ సూటిగా ఆన్సర్ ఇచ్చాడు. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై ఫైకస్ చేసిందని చెప్పారు. కానీ ఆటగాళ్ల ఫిట్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కానీ అంతిమ నిర్ణయం ఫ్రాంఛైజీలదే అని రోహిత్ క్లారిటీ ఇచ్చారు.
Also Read : India at UNHRC: ప్రజాస్వామ్యం గురించి పాకిస్తాన్ పాఠాలు అవసరం లేదు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఆటగాళ్లకు భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు కాబట్టి ఆ నిర్ణయం ఫ్రాంఛైజీలపై ఉంటుందని రోహిత్ శర్మ అన్నారు. ఎవరైతే గాయాలతో ఇబ్బంది పడుతున్నారో..వారు ఏ ఐపీఎల్ జట్టుకైతే ఆడుతున్నారో ఆ జట్టు యాజమాన్యాలక ఉన్న పరిస్థితి వివరించాం.. ఇక అంతిమ నిర్ణయం ఆయా ఫ్రాంఛైజీలదే.. ఆటగాళ్లు కూడా తమ ఫిట్ నెస్ పై శ్రద్ద తీసుకోవాలంటూ రోహిత్ శర్మ సూచించారు. ఒకవేళ శరీరంలో మార్పులు గమనించినట్లయితే ఆయా ఫ్రాంఛైజీలతో మాట్లాడి ఒకటి రెండు మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకోవాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!