టీడీపీపై మరోసారి మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. 2016-17లో ఓఆర్ఆర్ కట్టాలంటే 8వేల ఎకరాలు అవసరం అని నివేదిక ఇచ్చారని, దీనికి 17 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసి అప్పట్లో చంద్రబాబు కేంద్ర సహాయం అడిగారని ఆయన అన్నారు. భూ సేకరణ చేసి ఇస్తే చూస్తామని కేంద్రం చెప్పిందని, కేంద్రం అడిగినా 2018 వరకు కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. అప్పడు వారు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా…
సీఆర్డీఏ రద్దు, 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిర్వఘ్నంగా పూర్తయ్యింది. న్యాయంస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టి రాజధాని రైతులు పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగింది. ఈ నేపథ్యంల మహాపాదయాత్ర ముగింపుగా ఈ రోజు తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ ఏర్పాటు చేశారు అమరావతి రైతులు. అయితే ఈ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఆయన తిరుపతి విమానాశ్రయంకు చేరుకొని అక్కడి నుంచి సభ ప్రాంగణానికి…
ప్రకాశం జిల్లా టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా..? సర్వే పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారా? తమ పదవులు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఎవరు? ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను కలవరపెట్టేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? రాబిన్శర్మ బృందంతో టీడీపీ పరిస్థితిపై సర్వే..! గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల టీడీపీ గెలిచింది. ఈ నలుగురిలో ఒకరు జారుకున్నా.. మిగిలిన వాళ్లంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టీడీపీలో ఆశించిన స్థాయిలో జోష్…
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండి అటు అమరావతి, ఇటు పోలవరంకు వెళ్లనీయకుండా పశ్చిమ గోదావరిలోని టీడీపీ నేతలను ఎక్కడిక్కడ పోలీసులు గృహనిర్భంధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దీంతో టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ… ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం గా ఏపీని నాడు చంద్రబాబు అభివృద్ధి…
ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు త్యాగాలు త్యాగాలు అని పదేపదే అంటున్నారని ఎవ్వరి కోసం త్యాగాలు చేస్తున్నారో చెప్పాలని ప్రతిపక్షాలను బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్టులు కడుతుంటే ఎంత మంది రైతులు భూములు ఇవ్వలేదని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న పనులను త్యాగం అంటారా? ఒక సామాజిక వర్గం కోసం చేసే పనులు త్యాగాలు…
పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ టీడీపీని కలవర పెడుతున్నాయా? ఈ మధ్య కాలంలో టీడీపీని జనసేనాని ఎక్కడా విమర్శించకపోయినా.. ఆందోళన ఎందుకు? పవన్ చూపిస్తున్న సింపతీపై తమ్ముళ్ల లెక్కలేంటి? లెట్స్ వాచ్..! టీడీపీని జనసేనాని తిట్టకపోయినా.. తమ్ముళ్లలో టెన్షన్..! కొంతకాలంగా జనసేనాని పవన్కల్యాణ్ సీఎం జగన్ మీద.. YCP ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికారపార్టీ నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. అలాగే పవన్ ఏపీకి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి రాజకీయం కాస్తో కూస్తో వేడెక్కుతూనే ఉంది.…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్పై విమర్శలు చేశారు. 3 టాయిలెట్లు కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. హామీ నేరవేర్చని జగన్ ప్రజలకు ఇప్పుడేం చెబుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా జగన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రెండెన్నరేళ్లలో రాష్ట్రాన్ని జగన్ దారుణంగా ధ్వంసం చేశారన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీ ఆర్ధిక కష్టాల…
చంద్రబాబుకు వచ్చింది కోపమేనా..? టీడీపీని చక్కదిద్దుకునేందుకు చికిత్స మొదలుపెట్టిన ఆయనకు.. వాస్తవాలు తెలుస్తున్నకొద్దీ కోపం నషాళానికి ఎక్కుతోందా? కొందరు కోవర్టులుగా మారారనే అనుమానం రోజు రోజుకూ బలపడుతోందా? చేతలు కాలక ఆకులు పట్టుకున్న బాబు.. ఆగ్రహాన్ని కంటిన్యూ చేస్తారా..? మధ్యలోనే మెత్తబడతారా..? పార్టీ చీఫ్కు వచ్చిన కోపంపై తమ్ముళ్లలో చర్చ..! టీడీపీలో కోవర్టులున్నారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. మండలం.. నియోజకవర్గం.. జిల్లా స్థాయిల్లో కాదని.. ఏకంగా రాష్ట్రస్థాయిలోనే కోవర్టులు ఉన్నారని.. వారిని ఏరిపారేస్తానని కుప్పం సమీక్షలో చెప్పారు…
గత టీడీపీ హయాంలో రూ. 8 కోట్ల 20 లక్షలతో ముడసర్లోవ వద్ద ట్రాన్సీట్ హాల్ట్ ఏర్పాటు చేశాం. ఆధునిక యంత్రాలతో చెత్త నుంచి కంపోస్టు తయారీ, మిగిలిన చెత్తను కాపులప్పాడ యార్డుకు తరలించాలని దీనిని ఏర్పాటు చేసారు అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వకుండా దీన్ని డంపింగ్ యార్డుగా తయారు చేసింది. ఆ డంపింగ్ యార్డు వల్ల పక్కనే ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ జలాలు,…
టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ నిర్వహించే మదర్సాపై వక్ఫ్ బోర్డు అధికారులు దౌర్జన్యం రాజకీయ కక్ష సాధింపేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కక్ష సాధింపునకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, మదర్సాలపై దాడులకు పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. వైసీపీ నేతల కక్షసాధింపు చర్యలకు గుడి, బడి అనే వ్యత్యాసం కూడా లేదా..? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న మదర్సాను…