JC Prabhakar Reddy: తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జేసీ.. తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు అని పేర్కొన్నారు జేసీ.. “తాడిపత్రిలో తినడానికి మూడు పూటలా అన్నం దొరుకుతుంది. ఈ భూమి ఎంతో శక్తివంతమైనది. చరిత్రలో శ్రీ కృష్ణదేవరాయలు తాడిపత్రిలో ఆలయాలు నిర్మించడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు..” అని వెల్లడించారు..
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
ఇక, తాడిపత్రి భూమి మీద ఉన్న శక్తిని చాటుతూ, “ఇక్కడ సూర్యశక్తి (సోలార్) ప్రాజెక్ట్ను రెండు నెలల్లో పూర్తిచేస్తాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా మున్సిపాలిటీకి నెలకు 20 లక్షల ఆదాయం వస్తుంది,” అని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. మరోవైపు.. నా శత్రువు కూడా నా గురించి ఆలోచించి మాట్లాడే విధంగా చేసుకోవడం నా కోరిక.. ఎక్కడైనా, తాడిపత్రిలో బ్రతకలేని వ్యక్తి దేశంలో ఎక్కడ బ్రతకలేడు, అని ఆయన తమ పట్టణం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి చరిత్ర, ప్రస్తుత పరిస్థితులు మరియు భవిష్యత్తు అభివృద్ధిపై గౌరవంతో మాట్లాడారు. ఆయన మున్సిపాలిటీకి సౌరశక్తి ఆధారిత ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు..
మరోవైపు, తాడిపత్రి పట్టణంలో 4 కోట్ల రూపాయలతో సోలార్ ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవానికి భూమి పూజ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. జేసీ పార్కు వద్ద 40 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి లేదు… సంక్షేమ పథకాలు అమలు చేసేందుకే రాష్ట్ర ఆదాయం సరిపోతుందన్నారు. తాడిపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకే… ఖర్చులు పైసా పైసా ఆదా చేస్తూ… పరిశ్రమలు తీసుకొస్తున్నాం. సోలార్ ఏర్పాటు అయితే మున్సిపాలిటీ కి నెల నెలా 22 లక్షలు డబ్బులు ఆదా అవుతుంది. తాడిపత్రి త్వరలో డ్రీమ్ సిటీ గా మారబోతోంది.. ఏడాది తర్వాత తాడిపత్రి రూపురేఖలు మారిపోతాయని తెలిపారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి..
తాజావార్తలు
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?