రఘువీరా వస్తారా? కుమార్తెను బరిలో దింపుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చేశారు. సీఎం రేస్ వరకు వెళ్లారు కూడా. సడెన్గా పాలిటిక్స్కు దూరం. ఆథ్యాత్మిక.. సేవా కార్యక్రమాలకే పరిమితమై.. వాటిని కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు పొలిటికల్గా యాక్టివ్ అవుతారా? పార్టీ మారబోతున్నారా? ఎవరా నాయకుడు?
2019 తర్వాత రాజకీయాలకు దూరం..!
Also Read
రఘువీరారెడ్డి. రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉన్న వారికి ఈ పేరు.. సుపరిచితమే. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన ఆయన.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా.. పీసీసీ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారు. ఒకానొక సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో సీఎం రేసులో నిలబడ్డ నాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పీసీసీ పదవికి రాజీనామా చేసి.. స్వగ్రామం నీలకంఠాపురంకు వెళ్లిపోయారు రఘువీరారెడ్డి. పార్టీకి పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉండిపోయారు.
టీడీపీ, వైసీపీ నుంచి ఆహ్వానాలు ఉన్నాయా?
సొంతూరులో నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునర్మాణ పనుల్లో పడిపోయారు రఘువీరారెడ్డి. ఒకప్పుడు క్షణం తిరిక లేకుండా విమానాల్లో తిరిగిన ఆయన.. సాధారణ జీవితానికి పరిమితం అయ్యారు. రైతుగా మారి గడ్డి మోపులు మోశారు. పిల్లలతో ఆటలు, పెద్దలతో రచ్చబండపై ముచ్చట్లు.. టీవీఎస్ మోపెడ్పై చక్కర్లు.. ఇదే రఘువీరారెడ్డి జీవితం. ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆలయాన్ని నిర్మించారు. ఆరు నెలల తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని.. కొన్ని పార్టీలు ఆయనవైపు చూస్తున్నాయని.. ఇప్పటికే మంతనాలు జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇందులో ప్రధానంగా టీడీపీ ఉంది. అధికార వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయని అంటున్నారు. దానిపై రఘువీరా ఎక్కడా నోరు విప్పలేదు. కనీసం సన్నిహితులతో సూచాయగా కూడా తన అభిప్రాయం చెప్పలేదు.
రఘువీరాను లాగేందుకు టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోందా?
రఘువీరా బహిరంగంగా మాట్లాడి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇటీవల జరిగిన మాజీ సీఎం రోశయ్య సంస్మరణ సభకు వచ్చి రఘువీరా మాట్లాడారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయాలను ప్రస్తావించలేదు. అయితే రఘువీరా ఇప్పుడే రాజకీయాల్లోకి రారని.. నీలకంఠాపురంలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సుమారు ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తరువాతే రాజకీయాలవైపు చూసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. కానీ రఘువీరాను లాగేందుకు టీడీపీ నుంచి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్టు సమాచారం.
వారసురాలిగా కుమార్తెను ఎన్నికల బరిలో దించుతారా?
ఆయన చుట్టూ ఇంత జరుగుతున్నా.. రఘువీరా నోరు విప్పడం లేదు. మనసులో మాట చెప్పడం లేదు. రాజకీయాల్లో పునః ప్రవేశం చేస్తారా? లేక ఇప్పటిలాగే దూరంగా ఉంటారన్నది స్పష్టం కావట్లేదు. మరోవైపు రఘువీరా వారసురాలిగా ఆయన కుమార్తె వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే రఘువీరా రాజకీయాల్లోకి వస్తారా లేక కుమార్తెకు సహకరిస్తూ ఉంటారో చూడాలి.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!