రఘువీరా వస్తారా? కుమార్తెను బరిలో దింపుతారా?
ఒకప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చేశారు. సీఎం రేస్ వరకు వెళ్లారు కూడా. సడెన్గా పాలిటిక్స్కు దూరం. ఆథ్యాత్మిక.. సేవా కార్యక్రమాలకే పరిమితమై.. వాటిని కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు పొలిటికల్గా యాక్టివ్ అవుతారా? పార్టీ మారబోతున్నారా? ఎవరా నాయకుడు?
2019 తర్వాత రాజకీయాలకు దూరం..!
Also Read
రఘువీరారెడ్డి. రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉన్న వారికి ఈ పేరు.. సుపరిచితమే. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన ఆయన.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా.. పీసీసీ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారు. ఒకానొక సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో సీఎం రేసులో నిలబడ్డ నాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పీసీసీ పదవికి రాజీనామా చేసి.. స్వగ్రామం నీలకంఠాపురంకు వెళ్లిపోయారు రఘువీరారెడ్డి. పార్టీకి పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉండిపోయారు.
టీడీపీ, వైసీపీ నుంచి ఆహ్వానాలు ఉన్నాయా?
సొంతూరులో నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునర్మాణ పనుల్లో పడిపోయారు రఘువీరారెడ్డి. ఒకప్పుడు క్షణం తిరిక లేకుండా విమానాల్లో తిరిగిన ఆయన.. సాధారణ జీవితానికి పరిమితం అయ్యారు. రైతుగా మారి గడ్డి మోపులు మోశారు. పిల్లలతో ఆటలు, పెద్దలతో రచ్చబండపై ముచ్చట్లు.. టీవీఎస్ మోపెడ్పై చక్కర్లు.. ఇదే రఘువీరారెడ్డి జీవితం. ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆలయాన్ని నిర్మించారు. ఆరు నెలల తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని.. కొన్ని పార్టీలు ఆయనవైపు చూస్తున్నాయని.. ఇప్పటికే మంతనాలు జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇందులో ప్రధానంగా టీడీపీ ఉంది. అధికార వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయని అంటున్నారు. దానిపై రఘువీరా ఎక్కడా నోరు విప్పలేదు. కనీసం సన్నిహితులతో సూచాయగా కూడా తన అభిప్రాయం చెప్పలేదు.
రఘువీరాను లాగేందుకు టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోందా?
రఘువీరా బహిరంగంగా మాట్లాడి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇటీవల జరిగిన మాజీ సీఎం రోశయ్య సంస్మరణ సభకు వచ్చి రఘువీరా మాట్లాడారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయాలను ప్రస్తావించలేదు. అయితే రఘువీరా ఇప్పుడే రాజకీయాల్లోకి రారని.. నీలకంఠాపురంలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సుమారు ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తరువాతే రాజకీయాలవైపు చూసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. కానీ రఘువీరాను లాగేందుకు టీడీపీ నుంచి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్టు సమాచారం.
వారసురాలిగా కుమార్తెను ఎన్నికల బరిలో దించుతారా?
ఆయన చుట్టూ ఇంత జరుగుతున్నా.. రఘువీరా నోరు విప్పడం లేదు. మనసులో మాట చెప్పడం లేదు. రాజకీయాల్లో పునః ప్రవేశం చేస్తారా? లేక ఇప్పటిలాగే దూరంగా ఉంటారన్నది స్పష్టం కావట్లేదు. మరోవైపు రఘువీరా వారసురాలిగా ఆయన కుమార్తె వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే రఘువీరా రాజకీయాల్లోకి వస్తారా లేక కుమార్తెకు సహకరిస్తూ ఉంటారో చూడాలి.
తాజావార్తలు
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
-
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!