సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం సుప్రీం ధర్మాసనం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారం ఆయనకు చివరి పని దినం కావడంతో సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు తెలిపింది.
Aligarh Muslim University: ఉత్తర్ ప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ హోదాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈరోజు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడించింది.
సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనలను మార్చలేమని కోర్టు పేర్కొంది. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నియమాలను మధ్యలో మార్చలేమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత.. ముందస్తుగా చెప్పకుండా రూల్స్ మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది.
Uttara Pradesh Madrasa Act: ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం 2004పై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. దీంతో యోగి ప్రభుత్వం షాక్కు గురైంది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. విచారణ అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఉత్తరప్రదేశ్ లోని మదర్సా చట్టంపై మంగళవారం (నవంబర్ 5)న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం…
మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమేళనం నిర్వహించిన నామిడ్ల శ్రీను, వారి బృందానికి నా ధన్యవాదములు తెలిపారు కడియం శ్రీహరి. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నేను సుప్రీం కోర్ట్ తీర్పు లోబడే నేను మాట్లాడుతానని, షెడ్యూల్ కుల వర్గీకరణను నేను మనసా.. వచా కట్టు పడి వుంటానన్నారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. అగ్నిప్రమాదాలను నిషేధించాలని ఆదేశించినా పెద్దఎత్తున క్రాకర్లు ఎలా కాల్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి పటాకులు తెస్తున్నారని న్యాయమూర్తి అన్నారు. దీపావళికి ప్రజకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రజల్లో అవగాహన కొరవడిందని తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు కమిషనర్ వారంలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి తన నివాసంలో సమాలోచనలు జరిపారు.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిపై ఉన్న లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇమ్మిగ్రేషన్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో రియాకు భారీ ఊరట లభించినట్టు అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020…
ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా క్షీణించినందున ఉదయాన్ని బయటకు వెళ్లకపోవడం మంచిదని తన వ్యక్తిగత డాక్టర్ సలహా ఇచ్చారని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెప్పినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.