Justice Shekhar Kumar Yadav: హిందూ సభలో ప్రసంగం.. న్యాయమూర్తిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు..
- అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై దుమారం..
- చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు..
- వివరాలు కోరిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Shekhar Kumar Yadav: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన ‘‘మెజారిటీ’’ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు, పలు సంఘాలు సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని మంగళవారం వివరణ కోరింది. ప్రసంగానికి సంబంధించిన వివరాలనున అందించాలని ఆదేశించింది.
జస్టిస్ శేఖర్ యాదవ్ని తొలగించాలని కోరుతూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నోటీసుపై సంతకం చేయడంతో లోక్సభలో కూడా చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తి ప్రవర్తన రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించిందని ఓవైసీ అన్నారు. “అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్పై తొలగింపు చర్యలను కోరుతూ నేను నోటీసుపై సంతకం చేసాను. నోటీసులో 100 మంది లోక్సభ సభ్యుల సంతకం అవసరం అని, అప్పుడే లోక్సభ స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారు” అని ఓవైసీ చెప్పారు.
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
Read Also: Undavalli Arun Kumar Open Letter: డిప్యూటీ సీఎం పవన్కు ఉండవల్లి బహిరంగ లేఖ.. ఆ బాధ్యత మీదే..!
గత వారం వీహెచ్పీ లీగల్ సెల్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. మెజారిటీల(హిందువుల) అభీష్టం మేరకు భారతదేశం పనిచేస్తుందని ఆయన అన్నారు. ముస్లిం కమ్యూనిటీ పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. చిన్నప్పటి నుంచి వారి ముందు జంతువుల్ని చంపినప్పుడు వారి పిల్లలు ఎలా దయగా, సహనంలో ఉంటారని ప్రశ్నించారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ చెడ్డవారు కానప్పటికీ కఠ్ముల్లాలు దేశానికి ప్రమాదం అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సోమవారం సీపీఎం నేత బృందాకారత్, క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్ (సీజేఏఆర్) ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. జస్టిస్ శేఖర్ యాదవ్పై అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెండింగ్ కేసుల నుంచి న్యాయమూర్తిని తొలగించాలని కోరారు. ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థకు, మొత్తం న్యాయవ్యవస్థకే చెడ్డపేరు తెస్తాయని రాజ్యసభ మాజీ ఎంపీ బృందా కారత్ తన లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!