Justice Shekhar Kumar Yadav: హిందూ సభలో ప్రసంగం.. న్యాయమూర్తిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు..
- అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై దుమారం..
- చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు..
- వివరాలు కోరిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Shekhar Kumar Yadav: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన ‘‘మెజారిటీ’’ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు, పలు సంఘాలు సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని మంగళవారం వివరణ కోరింది. ప్రసంగానికి సంబంధించిన వివరాలనున అందించాలని ఆదేశించింది.
జస్టిస్ శేఖర్ యాదవ్ని తొలగించాలని కోరుతూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నోటీసుపై సంతకం చేయడంతో లోక్సభలో కూడా చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తి ప్రవర్తన రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించిందని ఓవైసీ అన్నారు. “అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్పై తొలగింపు చర్యలను కోరుతూ నేను నోటీసుపై సంతకం చేసాను. నోటీసులో 100 మంది లోక్సభ సభ్యుల సంతకం అవసరం అని, అప్పుడే లోక్సభ స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారు” అని ఓవైసీ చెప్పారు.
Also Read
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
Read Also: Undavalli Arun Kumar Open Letter: డిప్యూటీ సీఎం పవన్కు ఉండవల్లి బహిరంగ లేఖ.. ఆ బాధ్యత మీదే..!
గత వారం వీహెచ్పీ లీగల్ సెల్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. మెజారిటీల(హిందువుల) అభీష్టం మేరకు భారతదేశం పనిచేస్తుందని ఆయన అన్నారు. ముస్లిం కమ్యూనిటీ పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. చిన్నప్పటి నుంచి వారి ముందు జంతువుల్ని చంపినప్పుడు వారి పిల్లలు ఎలా దయగా, సహనంలో ఉంటారని ప్రశ్నించారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ చెడ్డవారు కానప్పటికీ కఠ్ముల్లాలు దేశానికి ప్రమాదం అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సోమవారం సీపీఎం నేత బృందాకారత్, క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్ (సీజేఏఆర్) ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. జస్టిస్ శేఖర్ యాదవ్పై అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెండింగ్ కేసుల నుంచి న్యాయమూర్తిని తొలగించాలని కోరారు. ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థకు, మొత్తం న్యాయవ్యవస్థకే చెడ్డపేరు తెస్తాయని రాజ్యసభ మాజీ ఎంపీ బృందా కారత్ తన లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ