Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
- మందిర్-మసీద్ వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- ప్రార్థన స్థలాల చట్టం-1991పై విచారణ..
- విచారణ ముగిసే వరకు ఎలాంటి సర్వేలకు ఆదేశాలు ఇవ్వొద్దు..
- కింది కోర్టులకు సుప్రీం ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ‘‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’’కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఈ పిటిషన్ పరిష్కరించే వరకు కొత్తగా ఎలాంటి పిటిషన్లు స్వీకరించొద్దని సూచించింది. మందిర్-మసీద్ వివాదాల్లో ఎలాంటి సర్వేలను అనుమతించమని చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులు మతపరమైన స్వభావాన్ని నిర్ణయించేందుకు ఎలాంటి ఆదేశాలు, సర్వేలు జారీ చేయవద్దని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
1991 ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు దాఖలయ్యాయి. ఈ చట్టం రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు పీవీ సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ విషయం సుప్రీంకోర్టు ముందు విచారణలో ఉన్నందున, విచారణ ముగిసే వరకు ఎలాంటి సర్వేలకు ఆదేశాలు ఇవ్వొద్దని కింది కోర్టులను ఆదేశించింది.
Also Read
- Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
- ED Raids: కేరళం రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు..
- Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ ఏంటి..?
Read Also: Calcium Drinks: శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించాలంటే ఈ డ్రింక్స్ తాగితే సరి
ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం.. ఆగస్టు 15, 1947 నాటికి ఒక ప్రార్థనా స్థలం ఎలాంటి స్థితిని కలిగి ఉందో, ఆ స్థితిని మార్చేందుకు నిరాకరింస్తుంది. అయితే, ఈ చట్టం జైనులు, హిందువులు, బౌద్ధులు, సిక్కుల హక్కుల్ని ఉల్లంఘిస్తుందని పిటిషన్లు పేర్కొన్నారు. ఇది ఆర్టికల్ 26,26, 29 రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తుందని తెలిపారు.
విచారణ సందర్భంగా కేంద్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేయని విషయాన్ని సీజేఐ గుర్తు చేశారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. 1991 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు తనకు సమయం కావాలని కోరారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలోని చాలా మసీదులు, హిందువుల పురాతన ఆలయాలపై నిర్మించారనే వివాదం నడుస్తోంది. ఇటీవల కాలంలో సంభాల్ జామా మసీదు, జౌన్పూర్లో అటాలా మసీదులు వివాదాస్పదమయ్యాయి. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదు,రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాపై వివాదాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
-
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!